AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: కావాలనే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది.. రాష్ట్రపతి ముర్ము, స్పీకర్ ఓం బిర్లాకు కిషన్ రెడ్డి లేఖ..

Kishan Reddy Letter: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి స్పీడు పెంచారు. బాధ్యతలు చేపట్టిన నాటినుంచే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, మొదటిసారి బాట సింగారంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఛలో బాట సింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Kishan Reddy: కావాలనే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది.. రాష్ట్రపతి ముర్ము, స్పీకర్ ఓం బిర్లాకు కిషన్ రెడ్డి లేఖ..
Kishan Reddy Mallikarjun Kharge
Shaik Madar Saheb
|

Updated on: Aug 01, 2023 | 4:22 PM

Share

Kishan Reddy Letter: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి స్పీడు పెంచారు. బాధ్యతలు చేపట్టిన నాటినుంచే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, మొదటిసారి బాట సింగారంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఛలో బాట సింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ జులై 20న చేపట్టిన ఛలో బాట సింగారం కార్యక్రమం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆరోజు ఉదయం నుంచే పోలీసులు చాలాచోట్ల బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, పలువురు బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి బాటసింగారం వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి వర్షంలోనే రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. అంతేకాకుండా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తానొక కేంద్రమంత్రినని.. ఇళ్ల పరిశీలనకు వెళ్తుంటే తనను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులపై ఫైర్‌ అయ్యారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం సైతం జరిగింది.

అయితే, ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కు లేఖ రాశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సమీక్షించేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బాటసింగారం బయలుదేరి వెళుతుండగా శంషాబాద్‌లో పోలీసులు అడ్డుకున్నారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పార్లమెంట్ సభ్యుడిగా తన విధులకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

తాను ముందుగానే కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నానని.. ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడం, తాను ధర్నా చేయడం తదితర వివరాలను లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..