Hyderabad: లచ్చలు.. లచ్చలు పెట్టిస్తాయ్.. కంట్రోల్‌లోకి వెళ్లారంటే ఖేల్ ఖతం..

బెట్టింగ్​ మరొకరిని బలి తీసుకుంది. బెట్టింగ్​ యాప్స్​కు అలవాటుపడి ఒకేసారి రూ. లక్ష నష్టపోయిన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అత్తాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. త్వరలో మంచి ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఇలా..

Hyderabad: లచ్చలు.. లచ్చలు పెట్టిస్తాయ్.. కంట్రోల్‌లోకి వెళ్లారంటే ఖేల్ ఖతం..
Representative Image

Edited By:

Updated on: Apr 18, 2025 | 3:43 PM

బెట్టింగ్​ మరొకరిని బలి తీసుకుంది. బెట్టింగ్​ యాప్స్​కు అలవాటుపడి ఒకేసారి రూ. లక్ష నష్టపోయిన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అత్తాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. త్వరలో మంచి ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఇలా బెట్టింగ్​ భూతానికి బలైపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్తాపూర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పెద్ద నర్సింహులు తనయుడు పవన్.. హైదరాబాద్​ జేఎన్​టీయూలో ఎంటెక్​ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో అత్తాపూర్​లో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇటీవల ఈజీ మనీ కోసం బెట్టింగ్​కు అలవాటు పడిన పవన్..​ రోజూ ఫోన్​లో ఓ యాప్​లో బెట్టింగ్​ ఆడుతూ భారీగా డబ్బులు నష్టపోయాడు. పలువురి వద్ద నగదు తీసుకుని బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు.

చివరకు కొన్ని యాప్​లలో లోన్స్ తీసుకొని.. ఆ డబ్బు సైతం పోగొట్టాడు. లోన్స్ ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో విషయం ఇంట్లో చెప్పగా.. తండ్రి పలు దఫాలుగా రూ. 98,200 పంపించారు. ఆ డబ్బుతో కూడా లోన్స్ కట్టలేదు. చివరకు తన తండ్రి ఇప్పించిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్, ఐఫోన్​ను అమ్మి కొన్ని అప్పులు చెల్లించాడు. అయినా సరే ఇంకా అప్పులు చెల్లించాల్సి ఉండటంతో.. పవన్​ తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి పెద్దనర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.