
జగిత్యాల జిల్లా మల్యాల మండలకేంద్రం శివారులోని ఓ వ్యవసాయ భూమిలో సోమవారం నాగుపాము, జెర్రిపోతులు బుసలు కొడుతూ కనిపించాయి. ఈ రెండు పాములు దాదాపు అరగంట పాటు సయ్యాట ఆడాయి. వ్యవసాయ పనుల నిమిత్తం పోలానికి వచ్చిన గడ్డం రాజేశం, నరహరి అనే ఇద్దరు రైతులు పొలంలో పాములు సయ్యాట ఆడటాన్ని చూశారు. మొదట పాములను చూసి భయపడిపోయిన రాజేశం, నరహరి.. తర్వాత వాటికి దూరంగా వెళ్లి అవి సయ్యాటలాడుతున్న దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించారు. ఆ పాములు సుమారు అరగంట పాటు ఇలానే నృత్యం చేస్తూ.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
అయితే తాను తీసిన వీడియోను రాజేశం సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్గా మారింది. వీడియో తీసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలను సినిమాలోనే చూశామని ఒకరు కామెంట్ చేయగా.. పాములను చూస్తేనే భయపడి పరుగులు తీస్తాం.. అలాంటి ఆరైతు ఎంత ధైర్యంతో ఎలా తీశాడో అని కామెంట్ చేశాడు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.