హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధితుల ధర్నా

| Edited By:

Mar 12, 2019 | 6:15 PM

తాము కొన్న ప్లాట్లలో ఇళ్ళను నిర్మించుకోకుండా ఫ్లాట్ ఓనర్స్ అడ్డుపడుతున్నారంటూ హైదరాబాద్‍లోని హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. హయత్ నగర్ మండలంలోని బాగ్ హయత్ నగర్ సర్వేనెంబర్ 308లో 1982లో 250 ప్లాట్లను కొందరు వ్యక్తులు కలిసి కొన్నారు. ఐతే తాము కొనుక్కున్న 250 ప్లాట్లలో ఇళ్ళను కట్టుకుందామని అనుకుంటే ఫ్లాట్ అమ్మిన ఓనర్స్ అడ్డుపడుతున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందులో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. తమకు ఎలాగైనా […]

హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధితుల ధర్నా
Follow us on

తాము కొన్న ప్లాట్లలో ఇళ్ళను నిర్మించుకోకుండా ఫ్లాట్ ఓనర్స్ అడ్డుపడుతున్నారంటూ హైదరాబాద్‍లోని హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. హయత్ నగర్ మండలంలోని బాగ్ హయత్ నగర్ సర్వేనెంబర్ 308లో 1982లో 250 ప్లాట్లను కొందరు వ్యక్తులు కలిసి కొన్నారు.

ఐతే తాము కొనుక్కున్న 250 ప్లాట్లలో ఇళ్ళను కట్టుకుందామని అనుకుంటే ఫ్లాట్ అమ్మిన ఓనర్స్ అడ్డుపడుతున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందులో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.