
తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 124 మందికి ఈ వైరస్ సోకింది. అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు పలువురికి కరోనా సోకింది. అకాడమీలో పనిచేసే ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీ, నలుగురు సీసీలతో సహా అక్కడున్న మెడికల్ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారందరినీ ఐసోలేషన్ సెంటర్లకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ అకాడమీలో 1900 కాడేట్లు శిక్షణ పొందుతుండగా.. వారికి త్వరలోనే పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 124 మందికి వైరస్ సోకడంతో అధికారులతో టెన్షన్ మొదలైంది. కాగా తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉండగా.. నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 13వేలను దాటేసింది. అందులో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్లోనే ఉండటంతో అధికారుల్లో ఆందోళన ఎక్కువవుతోంది.