ఘనంగా మెదక్ ఎస్పీ వివాహం.. హాజరైన కేసీఆర్, జగన్
మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డిని ఆమె మనువాడారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో వీరి కల్యాణ మహోత్సవం జరిగింది. ఇక వీరి వివాహానికి తెలంగాన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడివిడిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జగన్తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా వరుడు బలరాం రెడ్డి.. జగన్కు బంధువు అన్న విషయం […]
మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డిని ఆమె మనువాడారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో వీరి కల్యాణ మహోత్సవం జరిగింది. ఇక వీరి వివాహానికి తెలంగాన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడివిడిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జగన్తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా వరుడు బలరాం రెడ్డి.. జగన్కు బంధువు అన్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మాజీ డిప్యూటీ సీఎం పద్మా దేవేందర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు దీప్తి వివాహానికి హాజరు కాగా.. వారందరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు.