ఆగష్టు 15కు ముస్తాబవుతోన్న గోల్కొండ..!

| Edited By:

Aug 12, 2019 | 1:28 PM

ఆగష్టు 15కి ‘గోల్కొండ కోట’ ముస్తాబవుతోంది. ఇప్పటికే పోలీసులు గోల్కొండ కోటను తమ ఆధీనంలోకి తీసుకొని.. కోటను అందంగా.. ధగధగలాడేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఈసారి కూడా రాణీమహల్ గార్డెన్‌లో జాతీయ పతాకావిష్కరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల ముందు నుంచే పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. పంద్రాగష్టుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో 8 కేంద్రాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గోల్కొండ కోటలోని పరిసర […]

ఆగష్టు 15కు ముస్తాబవుతోన్న గోల్కొండ..!
Follow us on

ఆగష్టు 15కి ‘గోల్కొండ కోట’ ముస్తాబవుతోంది. ఇప్పటికే పోలీసులు గోల్కొండ కోటను తమ ఆధీనంలోకి తీసుకొని.. కోటను అందంగా.. ధగధగలాడేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఈసారి కూడా రాణీమహల్ గార్డెన్‌లో జాతీయ పతాకావిష్కరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల ముందు నుంచే పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు.

పంద్రాగష్టుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో 8 కేంద్రాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గోల్కొండ కోటలోని పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యంపై, సీఎం కాన్వాయ్‌ విచ్చేసే ప్రాంతాలను పోలీసులు ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఇప్పటినుంచే గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఆర్మీ పోలీసులు. కాగా.. గోల్కొండ కోటలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ జెండా ఎగురవేయనున్నారు.