Telangana: టెన్త్ టాపర్లకు అరుదైన కానుక – ఫ్రీగా ఫ్లైట్లో ఎక్కించిన హెడ్ మాస్టర్!
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు విమానం ఎక్కించారు. బేగంపేట ఉన్నత పాఠశాలలో చదివి మండలస్థాయిలో టాపర్స్గా నిలిచిన పాగల రసిత, శ్రీమంతుల రోహిత అనే ఇద్దరి విద్యార్థులను పెద్దపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా రామ్కిషన్ రావు విమానంలో ఎక్కించారు.తన సొంత ఖర్ఛుతో వారిని ఫ్లైట్లో విశాఖపట్నం పర్యటనకు తీసుకెళ్లారు. విద్యార్థుల అత్యుత్తమ ప్రదర్శనను పర్యాటక ప్రదేశాల పర్యటనతో అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి, ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చి ఇద్దరు ఎస్ఎస్సి టాపర్లను విశాఖపట్నం పర్యటనకు తీసుకెళ్లారు. బేగంపేట ఉన్నత పాఠశాలలో చదివిన పాగల రసిత, శ్రీమంతుల రోహిత సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రసిత 558, రోహిత 557 మార్కులు సాధించారు. విద్యార్థుల ప్రదర్శనకు ముగ్ధుడైన పెద్దపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా రామ్కిషన్ రావు ఆదివారం వారిని విమానంలో విశాఖపట్నం పర్యాటక ప్రదేశాలను చూడటానికి తీసుకెళ్లారు. ఆయన తన సొంత ఖర్చులతో విద్యార్థులను పర్యాటక ప్రదేశాల సందర్శనకు తీసుకెళ్లారు.
అయితే కష్టపడి చదివి పరీక్షలో మంచి ఫలితాలు సాధించినందుకు గాను.. వారి అత్యుత్తమ ప్రదర్శనను పర్యాటక ప్రదేశాల పర్యటనతో అభినందించారు రామ్కిషన్ రావు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకు బేగంపేట నివాసితులు రామ్కిషన్ రావును అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఎస్ఎస్సిలో వంద శాతం ఫలితాలు సాధించడానికి ప్రధానోపాధ్యాయుడు కూడా కృషి చేయడం గర్వకారనం అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




