Hyderabad: కేబీఆర్ పార్క్‌లో బయటపడ్డ నిజాం కాలంనాటి పెట్రోల్ పంపు

ప్రతిరోజు ఎంతోమంది ఉదయం ఈ పార్కుకు వాహ్యాళికి వస్తున్నా.. రాజు అల్లూరి అనే వ్యక్తి ఇటీవల దీనిని గుర్తించారు. హైదరాబాద్‌ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు ఈ ప్రైవేటు పంప్‌ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసకుందాం పదండి...

Hyderabad: కేబీఆర్ పార్క్‌లో బయటపడ్డ నిజాం కాలంనాటి పెట్రోల్ పంపు
Nizam Petrol Pump

Updated on: Feb 29, 2024 | 11:43 AM

హైదరాబాద్‌లో అరుదైన సంఘటన వెలుగుచూసింది. కేబీఆర్‌ పార్క్‌లో నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు బయటపడింది.  పార్క్‌‌లో వాకింగ్‌కు వచ్చిన ఓ వ్యక్తి దీన్ని గుర్తించారు. అతను పెట్రోల్ బంక్‌‌కు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇన్నాళ్లూ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్‌ పంపు ఎండాకాలం రావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది.  నిజాం తన కార్లు, మోటారు యంత్రాలు, ఇతర వాహనాలలో ఇంధనం నింపేందుకు దీన్ని వినియోగించినట్లు చెబుతున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో కేబీఆర్ పార్క్‌కు వచ్చేవాళ్లు పెట్రోల్‌ పంపును చూడటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు.  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్..  హైదరాబాద్ స్వదేశీ సంస్థానాన్ని పాలించిన చివరి నవాబు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరుపొందారు.

హైదరాబాద్‌లోని KBR నేషనల్ పార్క్ 142.5 హెక్టార్ల వైశాల్యంలో ఉంటుంది. గతంలో దీన్ని గతంలో జూబ్లీ హిల్స్ ఫారెస్ట్ బ్లాక్ అని పిలిచేవారు. గతంలో హైదరాబాద్ నిజాం ఆధీనంలో ఉన్న ఈ పార్కును అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  అయితే  2.4 హెక్టార్ల భూమిని మాత్రం నిజాం కుటుంబీకులు ఆధీనంలోనే ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..