చినజీయర్ స్వామి తిరు నక్షత్ర మహోత్సవం.. హాజరైన మై హోం రామేశ్వర రావు

| Edited By: Pardhasaradhi Peri

Oct 29, 2019 | 9:48 AM

ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి తిరు నక్షత్ర మహోత్సవం(64వ జయంతి వేడుకలు) హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కమలానంద భారతి స్వామి, విశ్వేశ తీర్థ స్వామి, విజయానంద స్వామి, శఠగోప రామనుజ పెరియర్ జీయర్ స్వామి, మైసూర్ అవదూతా దత్తపీఠాధిపతి సచిదానంద స్వామి, దత్త విజయానంద స్వామి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో పాటు మైహోం అధినేత జూపల్లి రామేశ్వర రావు […]

చినజీయర్ స్వామి తిరు నక్షత్ర మహోత్సవం.. హాజరైన మై హోం రామేశ్వర రావు
Follow us on

ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి తిరు నక్షత్ర మహోత్సవం(64వ జయంతి వేడుకలు) హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కమలానంద భారతి స్వామి, విశ్వేశ తీర్థ స్వామి, విజయానంద స్వామి, శఠగోప రామనుజ పెరియర్ జీయర్ స్వామి, మైసూర్ అవదూతా దత్తపీఠాధిపతి సచిదానంద స్వామి, దత్త విజయానంద స్వామి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో పాటు మైహోం అధినేత జూపల్లి రామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వర రావు మాట్లాడుతూ.. చినజీయర్ తిరు నక్షత్ర మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అన్నీ తానైన రామేశ్వర రావును చినజీయర్ స్వామి సత్కరించారు. మనల్ని మనం తీర్చిదిద్దుకునేందుకు ఆచార్యులు మార్గనిర్దేశం చేస్తారన్నారు జూపల్లి.