AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీ ముఠాను గుట్టురట్టు చేసిన పోలీసులు

ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ మాఫియాకు చెక్ పెట్టారు హైదరాబాద్ రాచకొండ పోలీసులు. సోషల్ మీడియా వేదికగా కిడ్నీ కావాలని ప్రకటన చేసి.. అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన అమ్రిష్ ప్రతాప్, సందీప్ కుమార్, రిథికా 2013 నుంచి కిడ్నీ మార్పిడి చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ప్రకటనలు చేస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ముఠా సభ్యులు […]

కిడ్నీ ముఠాను గుట్టురట్టు చేసిన పోలీసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 02, 2019 | 12:34 PM

Share

ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ మాఫియాకు చెక్ పెట్టారు హైదరాబాద్ రాచకొండ పోలీసులు. సోషల్ మీడియా వేదికగా కిడ్నీ కావాలని ప్రకటన చేసి.. అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన అమ్రిష్ ప్రతాప్, సందీప్ కుమార్, రిథికా 2013 నుంచి కిడ్నీ మార్పిడి చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ప్రకటనలు చేస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ముఠా సభ్యులు వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా ఈ ముఠా పరిచయమైంది. డబ్బు ఆశచూపి.. ఒక్క కిడ్నీకి రూ. 20లక్షలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. మొదట బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు.. భార్య తరపు బంధువులకు కిడ్నీ ఇస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. గతేడాది ఆగష్టులో టర్కీకి తీసుకెళ్లి సర్జరీ చేయించారు. అనంతరం డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి బెదిరించారు. దీంతో.. బాధితుడు హైదరాబాద్ చేరుకుని పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సైబర్ సెల్ పోలీసులు.. ఢిల్లీ వెళ్లి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈజిప్టు, సింగపూర్, టర్కీలో.. ఈ ముఠా కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కుంభకోణంలో పలువురు వైద్యుల హస్తమున్నట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, ప్రింటింగ్, లేజర్ మిషన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే