
జూబ్లి హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 5 గంటల లోపు క్యూ లైన్ ఉన్నవాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. తాజాగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. మెజార్టీ సర్వేలు కాంగ్రెస్కు పాజిటివ్గా చూపిస్తున్నాయి.
HMR సర్వే ప్రకారం కాంగ్రెస్కు 48.31 శాతం, బీఆర్ఎస్కు 43.18 శాతం, బీజేపీ 5.84శాతం ఓట్లు వచ్చే చాన్స్ ఉంది.
చాణక్య స్ట్రాటజీస్ సంస్థ.. కాంగ్రెస్కు 46శాతం, బీఆర్ఎస్కు 43 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
స్మార్ట్ పోల్ సర్వే .. కాంగ్రెస్కు 48.2శాతం, BRSకు 42.1 శాతం, BJPకి 7.6 శాతం, ఇతరులకు 2.1శాతం ఓట్లు పోలయ్యే అవకాశముందని తెలిపింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో జూబ్లి హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి పోటీ చేశారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న రానున్నాయి.