మరో అంతర్జాతీయ వేడుకకు భాగ్యనగరం సిద్ధమైంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు హైదరాబాద్ నగరవాసుల్ని కనువిందు చేయనున్నాయి. ఈ విమానాలపండగకు బేగంపేట ఎయిర్పోర్టు (Begumpet airport) వేదిక కానుంది. ఈమేరకు ఈనెల 24 నుంచి ‘వింగ్స్ ఇండియా-2022’ (wingsindia 2022)పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు (మార్చి 27వరకు) ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కాగా ఈ ప్రదర్శనల్లో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50వేల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
కాగా కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. విమానాల ప్రదర్శనలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి మూడురోజులు ప్రముఖులు, వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.
#WingsIndia2022 spreads its wings with the Government of Maharashtra @CMOMaharashtra as our partner state. Have you booked your dates for Asia’s largest #CivilAviation event? Join us from the 24th of March onwards at Begumpet Airport, Hyderabad. https://t.co/LtxJtEKBY0 pic.twitter.com/6mkcJfyz7e
— Wings India 2022 (@WingsIndia2022) March 12, 2022
Also Read: Tollywood Movies: ఈ వారం థియేటర్లలో..ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
Viral Video: ఇదెక్కడి పిచ్చిరా బాబు.. లైకుల కోసం ఇలా చేస్తారా.. పట్టు తప్పితే యమలోకానికే!
Cheapest Electric Car: ఎలక్ట్రిక్ కార్ ప్రియులకు శుభవార్త.. అత్యంత తక్కువ ధరలో MG E230..