గచ్చిబౌలిలో సంచితో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి తనిఖీ చేయగా..

గచ్చిబౌలిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల దాడి… నానక్‌రామ్‌గూడలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు అరెస్ట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, క్యాబ్ డ్రైవర్ వద్ద నుంచి 2.398 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఒడిశా లింక్‌ను పోలీసులు బయటపెట్టారు. పూర్తి వివరాలు కథనం లోపల..

గచ్చిబౌలిలో సంచితో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి తనిఖీ చేయగా..
Ganja

Edited By:

Updated on: Apr 13, 2026 | 8:53 PM

సైబరాబాద్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలో సోమవారం తెల్లవారుజామున భారీ ఆపరేషన్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఏప్రిల్ 13, 2026 ఉదయం సుమారు 1:30 గంటల సమయంలో గచ్చిబౌలి పోలీసులు, ఎస్‌ఓటీ శేరిలింగంపల్లి బృందం కలిసి నానక్‌రామ్‌గూడలోని హనుమాన్ ఆలయం సమీపంలో దాడి చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో గంజాయిని అక్రమంగా నిల్వ చేసి విక్రయానికి సిద్ధమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో ప్రేమానంద్ మల్లిక్ (24) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, విశాల్ అలియాస్ విషు (26) అనే క్యాబ్ డ్రైవర్ ఉన్నారు. వారి వద్ద నుంచి సుమారు 2.398 కిలోల గంజాయి (మొత్తం బరువు 2.592 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని మూడు ప్యాకెట్లలో బ్రౌన్ టేప్‌తో ప్యాక్ చేసి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో, ఈ గంజాయిని ఒడిశాకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి నుంచి తెచ్చుకున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో విశాల్ పంపిణీ బాధ్యతలు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో రాఘవేంద్రతో పాటు ఆకాష్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అరెస్టయిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us