
దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాదిన వివాహ వ్యవస్థను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పుణ్యమా అని ‘సీక్రెట్ అఫైర్స్’ ఈజీ అవ్వడంతో మ్యారేజ్, సంబంధాల పట్ల యువతలో దృక్పథం కూడా మారుతోంది. డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో దేశంలో ఈ యాప్ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్కు మన దేశంలో 40 లక్షల(4 మిలియన్ల) మంది వినియోగదారులు ఉండటం గమనార్హం. మొత్తం వినియోగదారుల్లో పురుషులు 65 శాతం ఉండగా, మహిళలు 35 శాతం ఉన్నారు. మోడరన్ లైఫ్ స్టైల్, ఎమోషనల్గా సంతృప్తి లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత బయటి సంబంధాల కోసం మహిళలు వెతుకుతున్నారని తేలింది.
బెంగళూరులో 18 శాతం, హైదరాబాద్లో 17 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాలతో పాటు లక్నో, సూరత్ లాంటి టైర్-2 పట్టణాల్లో కూడా దీని వినియోగం పెరుగుతోందట. అత్యధికంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య(లంచ్ బ్రేక్ సమయంలో).. అలాగే రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ యాప్ను వాడుతున్నారు. పురుషులు తమ కంటే చిన్న వయస్సు ఉన్నవారిని కోరుకుంటే, మహిళలు డాక్టర్లు, సీఏలు లాంటి వృత్తిపరంగా స్థిరపడిన వారిని ఇష్టపడుతున్నారని డేటా చెబుతోంది.
ఇది చదవండి: లేటుగా సూర్యోదయం.. సాయంత్రం కనిపించని గ్రామం! ఎక్కడో కాదు మన తెలంగాణలోనే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి