సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. హిందూమతాన్ని కించపరిచే విధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. మార్చి 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో హిందువులను ఉద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు కూడా ఈసీకి […]

సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

Updated on: Apr 10, 2019 | 2:03 PM

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. హిందూమతాన్ని కించపరిచే విధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

మార్చి 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో హిందువులను ఉద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది.