Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3కేజీల బంగారం పట్టివేత.. ఎలా దాచారో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే!

హైదరాబాద్‌లో మరోసారి భారీ బంగారం పట్టుబడింది. శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 3.38 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3కేజీల బంగారం పట్టివేత.. ఎలా దాచారో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే!
Gold Seized

Updated on: Sep 18, 2025 | 10:03 PM

అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డారు ముగ్గురు ప్రయాణికులు, వారి నుంచి 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకన్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడంతో ఎయిర్‌పోర్టు అధికారులు వారిని అడ్డగించారు. వారి దగ్గర ఉన్న ఐరన్‌ బాక్స్‌ను తీసి తనిఖీ చేయగా.. అందులో 3.38 కిలోల బంగారాన్ని గుర్తించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత ఆ బాక్స్‌లోని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ. 3.36 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రయాణికుల వద్ద దొరికిన బంగారానికి సంబంధించి సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.