YS Sharmila: తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యమంటూ తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) రిజిస్ట్రేషన్కు అడ్డంకులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్టీపీ పేరుతో రిజిస్ట్రేషన్కు చేసుకున్న పార్టీకి అభ్యంతరాలు వచ్చాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇప్పటికే అన్న వైఎస్ఆర్ పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వారు షర్మిల కొత్త పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
వైఎస్ఆర్టీపీ పేరు తమ పార్టీని పోలి ఉందంటూ అన్నా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ బాషా ఎన్నికల కమిషన్కు గత నవంబర్లో ఫిర్యాదు చేశారు. బాషా ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. వైఎస్ఆర్టీపీ గుర్తింపుపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ విషయమై జనవరి 3న ఎన్నికల్ కమిషన్ వైఎస్ఆర్టీపీకి లేఖ రాసింది. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా వైఎస్ షర్మిల గత ఏడాది వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్టీపీ పార్టీకి అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. అదేరోజు పార్టీ జెండాను ఆవిష్కరించిన షర్మిల.. తెలంగాణలో పలు ప్రజా సమస్యలై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే పలు రకాల దీక్షల పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు షర్మిల.
Also Read: Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..
Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Hyderabad: కరోనా విలయతాండవం.. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్యులకు పాజటివ్..