Telangana: వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. ఇవగో పూర్తి డీటేల్స్..

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. వరద నీటితో ట్రాక్‌లు మునిగిపోవడంతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది.

Telangana: వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. ఇవగో పూర్తి డీటేల్స్..
Train Diversions

Updated on: Aug 28, 2025 | 1:02 PM

తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదనీటితో కొన్ని రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో.. దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు చేపట్టింది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని మార్గమార్చారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కరీంనగర్‌–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్‌, కాచిగూడ–మెదక్‌, మెదక్‌–కాచిగూడ, బోధన్‌–కాచిగూడ, ఆదిలాబాద్‌–తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి. గురువారం నిజామాబాద్‌–కాచిగూడ రైలు రద్దు కానుంది. మహబూబ్‌నగర్‌–కాచిగూడ, షాద్‌నగర్‌–కాచిగూడ రైళ్లను కొంత దూరం వరకే నడిపి పాక్షికంగా రద్దు చేశారు.

కామారెడ్డి–బికనూర్‌–తలమడ్ల, అకన్పేట్‌–మెదక్‌ మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు ఎలా మారతాయో బట్టి రద్దయే, దారిమార్చే రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచింది. కాచిగూడ: 9063318082, నిజామాబాద్: 970329671, కామారెడ్డి: 9281035664, సికింద్రాబాద్: 040–27786170 నంబర్లకు కాల్ చేసి.. రైళ్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

ఏయే రైళ్లు రద్దయ్యాయి.. ఏయే సర్వీసులపై ఎఫెక్ట్ పడింది.. ఏయో సర్వీసులు దారి మళ్లించారో దిగువన చూడండి…