Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. అప్పటిలోపు చెల్లించిన వారికి మాత్రమే 90శాతం రాయితీ!
హైదరాబాద్ నగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ పొందేందుకు ఈ నెల 31నే చివతి తేదీ అని GHMC కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. ఈ గడువులోపు చెల్లించిన వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. ఆస్తి పన్ను బకాయిలు వెంటనే చెల్లించంచే వారికి వడ్డీపై 90 శాతం రాయితీ కల్పించనున్నట్టు జీహెచ్ఎమ్సీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. అయితే వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ పొందేందుకు ఈ నెల 31నే చివతి తేదీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ గడువులోపు చెల్లించిన వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న గృహ యజమానులు ఆస్తి పన్ను బకాయిలు తక్షణమే చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందాలని కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-26 సంవత్సరంకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలు ఈ నెల 31 వ తేదీలోగా చెల్లించే వారికి ఓటీఎస్ పథకం కింద వడ్డీపై 90 శాతం రాయితీ ఇస్తుందన్నారు. ఆస్తిపన్ను బకాయిలు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు.
ఆన్లైన్ చెల్లించాలి అనుకునే వారు www ghmc.gov.in పోర్టల్, MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ లలో తక్షణమే చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి తద్వారా నగరాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను మొండి బకాయిదారుల పై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
