Telangana: యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు మృతి

|

Apr 29, 2022 | 7:44 PM

యాదాద్రి(Yadadri) భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో(Yadagirigutta) ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్ లో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి,..

Telangana: యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు మృతి
Building
Follow us on

యాదాద్రి(Yadadri) భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో(Yadagirigutta) ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్ లో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కూలిన భవనం ముందు భాగంలో రెండు దుకాణాలు నిర్వహిస్తుండగా, వెనుక భాగంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రమాద సమయంలో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్న వారితో పాటు అక్కడికి వచ్చిన పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను భువనగిరి(Bhongir) ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాండేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలిన రెండంతస్తుల భవనం 35 ఏళ్ల క్రితం కట్టారని స్థానికులు చెబుతున్నారు.

పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ కు అంతరాయం లేకుండా చూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతున్న యాదాద్రి పట్టణంలో ఈ ఘటన జరగడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికంగా భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Minister Roja: కేసీఆర్‌ను కలిసి వచ్చి.. కేటీఆర్‌కు ఏపీ మంత్రి రోజా కౌంటర్