
Telangana Elections: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే అగ్రనేతలంతా తెలంగాణ ప్రచారాన్ని ప్రారంభించారు. తొలివిడత విజయభేరి బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి అగ్రనేతలు రెండో విడత బస్సు యాత్రను చేపట్టనున్నారు. కాంగ్రెస్పార్టీ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. నవంబర్2వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగనుంది. రెండో విడతలో 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేయనున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని తాండూరు, పరిగి, చేవెళ్లలో పర్యటించనున్నారు. ఆదివారం ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే మెదక్లోక్సభ సెగ్మెంట్లోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్లో బస్సు యాత్రలో పాల్గొంటారు. సంగారెడ్డి, మెదక్లో జరిగే సభల్లో ఖర్గే పాల్గొంటారు.
ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే.. తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజక వర్గాల్లో డికె శివకుమార్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరులో, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిగిలో, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు డికె శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈనెల 30వ తేదీన భువనగరి పార్లమెంట్సెగ్మెంట్లోని జనగామ, ఆలేరు, భువనగిరి, 31న నల్గొండ పార్లమెంట్సెగ్మెంట్లలోని నాగార్జునసాగర్, నాగర్కర్నూల్సెగ్మెంట్లలోని కొల్లాపూర్లో బస్సు యాత్ర నిర్వహిస్తారు.
రాహుల్ గాంధీ నవంబర్1న నాగర్కర్నూల్పార్లమెంట్ సెగ్మెంట్లలోని కల్వకుర్తి, మహబూబ్నగర్ సెగ్మెంట్లలోని జడ్చర్ల, షాద్నగర్, నవంబర్ 2న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బస్సు యాత్రల్లో పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..