
సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడూ ఫైరే.. తుటాల్లాంటి మాటలు.. ఛలోక్తులు.. విమర్శలు.. ఇవన్నీ చూస్తునే ఉంటాం.. నిత్యం అధికారులతో మీటింగ్.. పలు అంశాలపై సమీక్షలు.. పార్టీ కేడర్ తో రాజకీయ సమావేశాలు.. తీరకలేని విధంగా అపాయిట్మెంట్స్.. ఇలా హాట్ హాట్ అప్డేట్స్తో నిత్యం సీఎం రేవంత్ రెడ్డి వార్తల్లో ఉంటారు.. అలాంటి సీఎం రేవంత్ రెడ్డి.. సడెన్ గా గంటె పట్టారు.. వంటగదిలో ప్రత్యక్షమై పూరీలు వండారు.. సీఎం ఏంటీ.. పూరీలు వండటం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. మీరు చదివింది నిజమే.. సీఎం రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి, పూరీలు చేసి పెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..
మనవడి కోసం గంటె పట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. స్వయంగా పూరీలు చేసి, నూనెలో వేయించారు.. మనవడు పక్కన ఉండగా.. ఆయన సరదాగా మాట్లాడుతూ.. దగ్గరుండి మరీ పూరీలు వండిపెట్టారు. అయితే.. మనవడితో చిట్చాట్ కూడా చాలా సరదాగా సాగింది. ఈ పూరీలు చాలా అని సీఎం రేవంత్ రెడ్డి.. మనవడు రేయాన్ష్ ని అడిగితే అమ్మమ్మకో అంటూ మనవడు అడగడం భలే ఫన్నీగా ఉంది.
తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు అడిగితే తప్పుతుందా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..