
ఈ దేశంలో నీళ్లు భగ్గుమని మండింది కావేరీ జలాల విషయంలోనే. తమిళనాడు-కర్నాటక మధ్య ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంటుందా ఇష్యూ. దాన్ని తలదన్నేలా తెలుగు రాష్ట్రాలు పోట్లాడుకుంటున్నాయి. విభజనకు ముందు మొదలైన గొడవ ఇదంతా. పరిష్కరించేందుకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వేసినా.. తేలలేదు. విభజనయ్యాక.. కృష్ణా, గోదావరి బోర్డులు వేశారు. పరిష్కారం కాలేదు. సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయి. మధ్యలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఇంకా కొలిక్కి రాలేదు. ఇంతకీ.. ఈ గొడవ ఎక్కడ మొదలైంది? ఇప్పుడెందుకొచ్చింది? వాటర్ ఒక ఎమోషన్. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి మొదటి కారణం.. నీళ్లు. ఈ దేశంలో రాష్ట్రాల మధ్య తగువు పెట్టింది కూడా ఈ నీళ్లే. అందుకే, రాష్ట్ర విభజన సమయంలో ఎక్కువ చర్చ జరిగింది కూడా ఈ నీటి గురించే. రెండు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటిని ఎలా వాడుకుంటారు, ఈ రెండు ప్రాజెక్టుల కింద ఉన్న నీటిని లక్షల ఎకరాలకు ఎలా పంపిణీ చేస్తారని ఆనాడే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నీటి అంశం.. రెండు రాష్ట్రాల మధ్య ఎడతెగని పంచాయితీని సృష్టిస్తుందని కూడా ఆనాడే చెప్పుకొచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. అచ్చంగా ఇవాళ అదే జరుగుతోంది కూడా. ఒకానొక సమయంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు సమసిపోయినట్టే కనిపించాయి. రెండు రాష్ట్రాలు సమన్వయంతో, ఒక సహకారంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు చెబుతూ...