Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా 8000 SIM కార్డ్‌లను బ్లాక్ చేసింది.. కారణం ఏంటంటే..!

Vodafone Idea: ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు పెరిగిపోయాయి. అసలు కంటే నకిలీ ఎక్కువ పట్టుకొస్తుంది. నకిలీ పత్రాలతో ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారు...

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా 8000 SIM కార్డ్‌లను బ్లాక్ చేసింది.. కారణం ఏంటంటే..!

Updated on: Mar 24, 2022 | 7:28 PM

Vodafone Idea: ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు పెరిగిపోయాయి. అసలు కంటే నకిలీ ఎక్కువ పట్టుకొస్తుంది. నకిలీ పత్రాలతో ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా టెలికం రంగంలో కూడా నకిలీ సిమ్‌ (SIM) కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా సంచలన నిర్ణయం తీసుకుంది. నకిలీ గుర్తింపు (Duplicate Identity) రుజువులపై జారీ చేసిన సిమ్ కార్డుల (SIM Cards)ను బ్లాక్ చేయాలని మధ్యప్రదేశ్ సైబర్ పోలీసులు మంగళవారం పలు టెలికాం కంపెనీలను ఆదేశించారు . ఫలితంగా ఫేక్ ఐడెంటిటీలపై జారీ చేసిన దాదాపు 8,000 సిమ్ కార్డులను వోడాఫోన్- ఐడియా బ్లాక్ (Vodafone Idea Block) చేసింది . గ్వాలియర్ సైబర్ జోన్ పోలీస్ ఆఫీసర్ సుధీర్ అగర్వాల్ మాట్లాడుతూ.. మోసగాళ్లు ఉపయోగించిన నంబర్‌ను వేరే వ్యక్తి గుర్తింపు పత్రం ఆధారంగా టెలికాం కంపెనీ (Telecom Company) జారీ చేసింది. తరువాత నేరంలో పాల్గొన్న వారికి సిమ్ కార్డులు జారీ చేయడంలో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు తేలింది.

2020లో ఓ ప్రకటన ద్వారా కారు కొంటామంటూ ఓ వ్యక్తి నుంచి రూ.1.75 లక్షలు మోసం చేశారు. గ్వాలియర్ సైబర్ సెల్ విభాగం దర్యాప్తు ప్రారంభించగా, మోసగాళ్ల సంఖ్య వేరొకరి పేరుతో జారీ చేసినట్లు తేలింది. నేరంలో పాల్గొన్న ఎనిమిది మంది మోసగాడికి సిమ్ కార్డు పొందేందుకు సహకరించినట్లు తర్వాత తెలిసింది. అనేక సిమ్‌కార్డులు బ్లాక్ కావడం దేశంలో ఇదే తొలిసారి అని సుధీర్ అగర్వాల్ తెలిపారు. ఈ సిమ్ కార్డులను బ్లాక్ చేయడానికి ఇతర కంపెనీలు కూడా నంబర్ల రీవెరిఫికేషన్ చేస్తున్నాయి.

మోసగాళ్లు వేర్వేరు నంబర్లను ఉపయోగించారు:

మోసగాళ్లు 20 రకాల నంబర్లను ఉపయోగించి మోసం చేసినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. దీనికి తోడు ఏడాదికి పైగా నకిలీ సిమ్ కార్డులు జారీ చేయడంపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. విచారణ తర్వాత ఈ నంబర్‌ల వినియోగదారులను ధృవీకరించడానికి వోడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ మరియు BSNL సహా అన్ని టెల్కోలకు సైబర్ యూనిట్ నోటీసులు జారీ చేసింది. విచారణలో, వోడాఫోన్-ఐడియా 7,948 సిమ్ కార్డులను బ్లాక్ చేసింది.

మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అమాయక ప్రజలను రక్షించేందుకు టెలికాం కంపెనీ ఇన్ని నంబర్లను బ్లాక్ చేయడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి అని సుధీర్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా, ప్రీ-యాక్టివేటెడ్ SIM కార్డ్ మోసం కేసులో వోడాఫోన్-ఐడియాకు టెలికాం ట్రిబ్యునల్ (TDSAT) ఉపశమనం నిరాకరించింది. టెలికాం డిపార్ట్‌మెంట్ (DoT) రూ.1.9 కోట్ల జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి:

Realme GT Neo 3: 150W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో మార్కెట్లో విడుదలైన రియల్‌మీ జీటీ 3

Newton Predicts: 2060లో ప్రపంచం అంతం కానుందా..? ప్రళయం ముంచుకొస్తుందా..? లేఖలో స్పష్టం చేసిన న్యూటన్‌..!