టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి.. త్వరలోనే ధరలు భారీగా పెరిగనున్నాయి? ఎందుకంటే?

రూపాయి క్షీణత, మెమరీ చిప్ కొరత కారణంగా జనవరి నుండి టీవీల ధరలు మూడు నుండి పది శాతం పెరగనున్నాయి. ముఖ్యంగా LED టీవీలు ప్రియం కానున్నాయి. దిగుమతి చేసుకునే భాగాలపై అధిక ఆధారపడటం, AI సర్వర్ల కోసం చిప్ డిమాండ్ ఈ పెరుగుదలకు కారణం.

టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి.. త్వరలోనే ధరలు భారీగా పెరిగనున్నాయి? ఎందుకంటే?
Tv

Updated on: Dec 15, 2025 | 6:00 AM

రూపాయి క్షీణత ప్రభావం త్వరలోనే సామాన్యుల జీవితాలపై, వారి జేబులపై కూడా కనిపించవచ్చు. వచ్చే ఏడాది జనవరిలో టీవీల ధరలు పెరగవచ్చు. మెమరీ చిప్‌ల ధర పెరుగుదల, రూపాయి రికార్డు స్థాయిలో తగ్గడం వల్ల, వచ్చే ఏడాది జనవరి నుండి టీవీల ధరలు మూడు నుండి నాలుగు శాతం పెరగవచ్చు అని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవలే తొలిసారిగా రూపాయి 90 డాలర్ల మార్కును దాటిన విషయం తెలిసిందే. LED TVలో దేశీయ విలువ జోడింపు కేవలం 30 శాతం మాత్రమే ఉండటం, ఓపెన్ సెల్స్, సెమీకండక్టర్ చిప్స్, మదర్‌బోర్డులు వంటి కీలక భాగాలు దిగుమతి చేసుకోవడం వలన రూపాయి విలువ తగ్గడం పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సమస్య మెమరీ చిప్ సంక్షోభంతో కూడా మరింత తీవ్రమైంది.

ఇక్కడ AI సర్వర్‌ల కోసం హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) కోసం భారీ డిమాండ్ తీవ్రమైన ప్రపంచ కొరతకు దారితీసింది, ఇది అన్ని రకాల మెమరీ (DRAM, ఫ్లాష్) ధరలను పెంచింది. చిప్ తయారీదారులు మరింత లాభదాయకమైన AI చిప్‌లపై దృష్టి సారిస్తున్నారు, టీవీల వంటి సాంప్రదాయ ఉపకరణాల సరఫరాను తగ్గిస్తున్నారు. మెమరీ చిప్ కొరత, రూపాయి బలహీనపడటం వల్ల LED టీవీ సెట్ల ధరలు మూడు శాతం పెరుగుతాయని హైయర్ అప్లయెన్సెస్ ఇండియా అధ్యక్షుడు ఎన్.ఎస్. సతీష్ అన్నారు. కొంతమంది టీవీ తయారీదారులు ధరల పెరుగుదల గురించి ఇప్పటికే తమ డీలర్లకు తెలియజేశారు. థామ్సన్, కోడాక్, బ్లూపంక్ట్ వంటి అనేక ప్రపంచ బ్రాండ్లకు లైసెన్స్‌లను కలిగి ఉన్న టీవీ తయారీదారు సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL), గత మూడు నెలల్లో మెమరీ చిప్ ధరలు 500 శాతం పెరిగాయని చెప్పారు.

SPPL CEO అవనీత్ సింగ్ మార్వా ప్రకారం.. మెమరీ చిప్ సంక్షోభం, క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా జనవరి నుండి టెలివిజన్ ధరలు ఏడు నుండి 10 శాతం వరకు పెరగవచ్చు. ప్రభుత్వం 32 అంగుళాలు, అంతకంటే పెద్ద టీవీ స్క్రీన్‌లపై GSTని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో ధర దాదాపు రూ.4,500 తగ్గిన తర్వాత ఇటీవల డిమాండ్ పెరిగిన పరిశ్రమకు ఇది అనుకూలమైన సమయం కాదు. పెరిగిన ఖర్చులు ఈ లాభాన్ని మింగేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ మాట్లాడుతూ.. మెమరీ చిప్ ధరలలో పెరుగుదల కారణంగా మేము ప్రస్తుతం నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఫ్లాష్ మెమరీ, DDR4 ధరలు సోర్స్ స్థాయిలో 1,000 శాతం వరకు పెరిగాయి, ప్రధానంగా AI డేటా సెంటర్‌లకు సరఫరా మార్పు కారణంగా ఇలా జరిగింది అని అన్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us