ఫోన్ పనిచేయడానికి సిమ్ కార్డు చాలా అవసరం. ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ తమ పేరు మీద వీటిని తీసుకుంటారు. వివిధ టెలికాం కంపెనీలు సిమ్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి విక్రయిస్తుంటాయి. ఫోన్లలో కూడా డబుల్ సిమ్ లు వాడుకునే వీలు ఉండడంతో అందరూ ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే మనం ఇష్టవచ్చినన్ని సిమ్ లు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. దానికి కూడా పరిమితి ఉంది. అది దాటితే జరిమానాతో పాటు, జైలు శిక్ష విధిస్తారు.
మీ పేరుతో అనేక సిమ్ కార్డులు తీసుకోవడం వలన ఇబ్బందుల్లో పడవచ్చు. టెలికాం చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువగా తీసుకుంటే భారీ జరిమానా చెల్లించాలి. పదేపదే నిబంధనను ఉల్లంఘిస్తే జైలుకు కూడా వెళ్లాల్ని రావచ్చు. జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య లైసెన్సుడ్ సర్వీస్ ఏరియాలు (ఎల్ఎస్ఏలు)లలో ఒక వ్యక్తి ఆరు సిమ్ లు, మిగిలిన రాష్ట్రాలలో తొమ్మిది వరకూ తీసుకునే వీలు ఉంది.
నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే జరిమానా చెల్లించాలి. మొదటి సారి నేరానికి రూ. 50 వేలు విధిస్తారు. ఇది ఒక్కొక్కరికి రూ. 2 లక్షల వరకూ ఉంటుంది. సాధారణంగా పరిమితికి మించి ఎక్కువ సిమ్ లు ఉంటే జరిమానా, జైలు శిక్ష విధించడానికి నిర్దిష్ట నిబంధన లేదు. అవసరమైతే వాటిని డిస్ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ మోసం పూరితంగా సిమ్ కార్డులను పొంది, వినియోగిస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటారు.
ఏది ఏమైనా మీపేరుపై పరిమితికి మించి సిమ్ లు ఉంటే మీరే జవాబుదారీగా ఉండాలి. ఒకవేళ మీరు కేవలం రెండు లేదా మూడు సిమ్ లు మాత్రమే వినియోగిస్తూ ఉండవచ్చు. కానీ మీ పేరు మీద వేరే వాళ్లు కూడా వాడుతూ ఉండే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఈ తరహా ఘటనలు కూాడా జరుగతున్నాయి. సిమ్ తీసుకున్నప్పుడు మనమిచ్చే గుర్తింపు పత్రాలను ఉపయోగించి, మరొకరు సిమ్ లు తీసుకుంటున్నారు.
ఎవరైనా మీ పేరుతో సిమ్ కార్డులను తీసుకుని, వాటిని మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పేరు మీదు ఎన్ని సిమ్ లు ఉన్నాయో పరిశీలించుకోవడం చాలా అవసరం. దానికి కోసం ఈ కింద పద్ధతులు పాటిస్తే చాలు. సంచార్ సాథీ అనే ప్రత్యేక పోర్టల్ ద్వారా చాలా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..