Google Maps: కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోన్న గూగుల్ మ్యాప్స్.. తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గం

Google Maps: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. పర్యావరణానికి మేలు చేస్తూ కాలుష్యాన్ఇన, భూతాపాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్న టెక్‌ సంస్థల జాబితాలో...

Google Maps: కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోన్న గూగుల్ మ్యాప్స్.. తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గం
Google Map

Updated on: Apr 28, 2021 | 1:37 PM

Google Maps: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. పర్యావరణానికి మేలు చేస్తూ కాలుష్యాన్ఇన, భూతాపాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్న టెక్‌ సంస్థల జాబితాలో గూగుల్‌ చేరనుంది. మ్యాప్స్‌లో కొత్త నేవిగేషన్‌ ఆప్షన్‌లను సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకు ముందు యూజర్లు ఒక డెస్టినేషన్‌ను మ్యాప్ప్‌లో సెర్చ్‌లో సెర్చ్‌, గూగుల్‌ అక్కడికి వేగంగా చేరుకునే మార్గాన్ని చూపించేది. కానీ ఇప్పటి నుంచి ఇంధనం ఆదా అయ్యే మార్గాలను మ్యాప్స్‌ డిస్‌ప్లే చేయనుంది. యూజర్లు కార్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడనుందని గూగుల్‌ తెలిపింది. ఇప్పుడు నేవిగేషన్‌ టూల్స్‌ మ్యాప్స్‌లో వేగవంతమైన మార్గానికి బదులుగా తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గాన్ని చూపిస్తాయి.

తాజా అప్‌డేట్‌ కు సంబంధించి వివరాలను గూగుల్‌ వెల్లడించింది. సమయానికి బదులుగా ఇంధనం ఆదా చేసేలా కస్టమర్లకు గూగుల్‌ మ్యాప్స్‌ సరికొత్త అప్‌డేట్లు ప్రకటించనుందని నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త అల్గారిథమ్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఎంత సమయాన్ని ఆదా చేస్తుందని చెప్పడానికి బదులు, ఎంత ఇంధనాన్ని యూజర్లు ఆదా చేసువచ్చో మ్యాప్స్‌ నేవిగేషన్‌ టూల్స్‌ అంచనా వేసి చూపిస్తాయి. అయితే కొత్త అప్‌డేట్‌ తర్వాత కూడా యూజర్లు మ్యాప్స్‌లో వేగవంతమైన మార్గాన్ని చూడవచ్చు. కానీ ఇంధనం ఆదా అయ్యే మార్గాన్ని (ఫ్యుయల్‌ ఎఫీషియంట్‌ రూట్‌) మ్యాప్స్‌ డిఫాల్ట్‌గా చూపిస్తుంది. ఈ ఏడాదిలోనే కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ప్రజా రవాణాకు చెందిన వివరాలను కూడా గూగుల్‌ మ్యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తోంది. బస్‌ స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రజా రవాణా మార్గాలను, ప్రయాణ వివరాలను సమయంతో సహా మ్యాప్స్‌ చూపించనుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యాపార సముదాయాలను సైతం గూగుల్ మ్యాప్స్‌ ప్రత్యేకంగా గుర్తించనుంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌ ద్వారా పనిచేసే డివైజ్‌లలో ఈ విడ్జెట్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.

ఇవీ చదవండి:

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌.. మైలేజీ ఎంతంటే..?

Oppo A53s 5G Phone : ఒప్పో A53s 5G ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 27 న విడుదల.. ధర రూ.15 వేలు.. అద్భుతమైన ఫీచర్లతో..

Loading...
Unable to load recommendations.
Follow Us