
టికెట్ బుకింగ్ను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడానికి ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1, 2025 నుండి IRCTC ఖాతా ఆధార్తో లింక్ చేయబడిన వ్యక్తులు మాత్రమే టికెట్ బుకింగ్, మొదటి 15 నిమిషాలకు టిక్కెట్లు బుక్ చేసుకోగలరని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మీ ఐఆర్సీటీసీ ఖాతా ఆధార్తో లింక్ చేయకుంటే మీరు మొదటి 15 నిమిషాల్లో టికెట్ పొందలేరు. అయితే మీ IRCTC ఖాతా ఆధార్తో లింక్ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఒక వేళ కాకుంటే దాన్ని ఎలా లింక్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం..
టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే చాలా మంది టికెట్ ఏజెంట్లు, కొంతమంది తప్పుడు వినియోగదారులు సీట్లను బ్లాక్ చేయడం జరుగుతోందని రైల్వే శాఖ గుర్తించింది. దీని కారణంగా సాధారణ ప్రయాణీకులు టిక్కెట్లు పొందలేకపోతున్నారు. ఈ సమస్యను నివారించడానికి, నిజమైన ప్రయాణీకులకు మొదటి అవకాశం ఇవ్వడానికి, ఆధార్ లింక్ తప్పనిసరి చేశారు. దీనివల్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, నిజమైన ప్రయాణీకులు ప్రయోజనం పొందుతారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏజెంట్లకు 10 నిమిషాల తర్వాత యాక్సెస్ అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి