ఆ రెండు టోర్నీలపై ఇంట్ర‌స్ట్ చూపిస్తోన్న రోహిత్…

ఈ సంవ‌త్స‌రం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​, ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్​ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు భార‌త‌ వైస్​ కెప్టెన్ రోహిత్​ శర్మ పేర్కొన్నాడు. కోవిడ్-19 కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్న‌ నేపథ్యంలో తన ఒపెనియ‌న్ వెల్లడించాడు​.

ఆ రెండు టోర్నీలపై ఇంట్ర‌స్ట్ చూపిస్తోన్న రోహిత్...
Follow us

|

Updated on: Jun 14, 2020 | 8:23 PM

ఈ సంవ‌త్స‌రం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​, ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్​ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు భార‌త‌ వైస్​ కెప్టెన్ రోహిత్​ శర్మ పేర్కొన్నాడు. కోవిడ్-19 కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్న‌ నేపథ్యంలో తన ఒపెనియ‌న్ వెల్లడించాడు​. లాక్​డౌన్​ వేళ ఫ్యాన్స్ ను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పలకరించిన రోహిత్​.. ఈ ఏడాది ఏ టోర్నీకి ఇంపార్టెన్స్ ఇస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా.. రెండింట్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.

అస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన వ‌రల్డ్ క‌ప్ పై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, బీసీసీఐ ఐపీఎల్​ను నిరవధికంగా పోస్ట్ పోన్ చేసింది. ఒకవేళ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​ వాయిదా వేస్తే ఐపీఎల్​ను నిర్వహించే అవ‌కాశాలున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్​లో రోహిత్​ నాయ‌క‌త్వంలో ముంబయి ఇండియన్స్​​ ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ విన్న‌ర్ గా నిలిచింది.