ఆ రెండు టోర్నీలపై ఇంట్రస్ట్ చూపిస్తోన్న రోహిత్…
ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్, ఇండియన్ ప్రిమియర్ లీగ్ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కోవిడ్-19 కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో తన ఒపెనియన్ వెల్లడించాడు.
ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్, ఇండియన్ ప్రిమియర్ లీగ్ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కోవిడ్-19 కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో తన ఒపెనియన్ వెల్లడించాడు. లాక్డౌన్ వేళ ఫ్యాన్స్ ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పలకరించిన రోహిత్.. ఈ ఏడాది ఏ టోర్నీకి ఇంపార్టెన్స్ ఇస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా.. రెండింట్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.
అస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన వరల్డ్ కప్ పై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, బీసీసీఐ ఐపీఎల్ను నిరవధికంగా పోస్ట్ పోన్ చేసింది. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ వాయిదా వేస్తే ఐపీఎల్ను నిర్వహించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో రోహిత్ నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ విన్నర్ గా నిలిచింది.