ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇప్పటికే నాలుగు పతకాలు సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్లో ఆమె సెమీస్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ)పై గెలిచింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు సింధూనే విజయం వరించింది. తొలి సెట్లో దాదాపు 9 పాయింట్ల తేడాతో ఓడిపోయిన సింధు… రెండు, మూడు సెట్లలో మాజీ ప్రపంచ నెం.1కు తిరుగులేని పోటీ ఇచ్చింది.