AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై పై ఢిల్లీ విజయం

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవ రికార్డు సొంతం చేసుకున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఏడాది పేరు, దుస్తులు రంగు మార్చి బరిలోకి దిగింది. ఐపీఎల్ 12వ సీజన్ తన తొలి మ్యాచ్ ను విజయంతో ఆరంభించింది. ఆదివారం ముంబైతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్ఠానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. […]

ముంబై పై ఢిల్లీ విజయం
Ravi Kiran
|

Updated on: Mar 25, 2019 | 11:03 AM

Share

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవ రికార్డు సొంతం చేసుకున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఏడాది పేరు, దుస్తులు రంగు మార్చి బరిలోకి దిగింది. ఐపీఎల్ 12వ సీజన్ తన తొలి మ్యాచ్ ను విజయంతో ఆరంభించింది. ఆదివారం ముంబైతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్ఠానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కొలిన్ ఇంగ్రామ్(47), శిఖర్ ధావన్ (43) లు రాణించగా.. చివర్లో వచ్చిన రిషబ్ పంత్(78 నాటౌట్) మెరుపులు మెరవడంతో ఈ భారీ స్కోర్ సాధించింది. ముంబై బౌలర్లలో మెక్లెనగన్‌ 3 వికెట్లు తీయగా.. హార్దిక్, కటింగ్, బుమ్రాలకు చెరో వికెట్ లభించింది.

ఇక అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై 19.2 ఓవర్లలో 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. యువరాజ్ సింగ్ (53) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ, రబడా చెరో రెండు వికెట్లు తీసి ముంబైను దెబ్బ తీశారు. ఢిల్లీ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.