Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BWF World Championship 2022: పతకాల వర్షం కురిపించేందుకు సిద్ధమైన భారత ఆటగాళ్లు.. అందరి చూపు ఈ నలుగురిపైనే..

2011 నుంచి ఈ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి రాలేదు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఉన్న ఫామ్ చూస్తుంటే ఈసారి భారత్ భారీ స్థాయిలో పతకాలు సాధిస్తుందని తెలుస్తోంది.

BWF World Championship 2022: పతకాల వర్షం కురిపించేందుకు సిద్ధమైన భారత ఆటగాళ్లు.. అందరి చూపు ఈ నలుగురిపైనే..
Bwf World Championship
Follow us
Venkata Chari

|

Updated on: Aug 22, 2022 | 7:03 AM

కామన్వెల్త్ గేమ్స్‌లో సంచలనం సృష్టించిన తర్వాత.. ప్రస్తుతం భారత షట్లర్లు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2011 నుంచి ఈ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి రాలేదు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఉన్న ఫామ్ చూస్తుంటే ఈసారి భారత్ భారీ స్థాయిలో పతకాలు సాధిస్తుందని తెలుస్తోంది. 2019లో స్వర్ణం సాధించిన సింధు ఈసారి ఛాంపియన్‌షిప్‌లో భాగం కావడం లేదు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలవకముందే ఆమె గాయంతో ఇబ్బంది పడింది. ఆమె లేకపోయినా భారత్ గట్టి పోటీదారుగా బరిలోకి దిగుతుంది.

లక్ష్య సేన్ నుంచి గోల్డ్ మెడల్ ఆశలు..

కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలిచిన తర్వాత, లక్ష్య ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరిగింది. అతను ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ కోసం బలమైన పోటీదారుగా బరిలోకి దిగనున్నాడు. 20 ఏళ్ల అతను డానిష్ లెజెండ్ హన్స్-క్రిస్టియన్ సోల్బెర్గ్ విట్టింగస్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. చివరిసారి ఇక్కడ కాంస్య పతకం సాధించాడు.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌పై కూడా భారీగా అంచనాలు..

థామస్ కప్, కామన్వెల్త్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న శ్రీకాంత్‌.. పసిడి పతకంపై తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యాడు. అతను కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే అతను ఐర్లాండ్‌కు చెందిన నేట్ న్గుయెన్, చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌లను ఓడించడానికి తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. శ్రీకాంత్ తొలి అడ్డంకులను అధిగమించగలిగితే, అతను క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ మలేషియాకు చెందిన లీ జియా జియాతో తలపడవచ్చు.

చిరాగ్-సాత్విక్ చరిత్ర సృష్టించే అవకాశం..

భారత నంబర్ వన్ డబుల్స్ జోడీపై చాలా అంచనాలు ఉన్నాయి. రంకిరెడ్డి పతకానికి చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ బలమైన పోటీదారులుగా నిలిచారు. ఈ భారత జోడీ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో ర్యాంక్‌లో ఉన్న భారత జోడీకి తొలి రౌండ్‌లోనే బై లభించింది. రెండో రౌండ్‌లో వారు మలేషియాకు చెందిన 13వ సీడ్ జోడీ గోహ్ వీ షెమ్, టాన్ వీ కియోంగ్‌తో తలపడే అవకాశం ఉంది.

సైనాపైనే అందరి చూపు..

పీవీ సింధు లేకపోవడంతో గత కొంతకాలంగా చాలా తక్కువ యాక్షన్‌లో కనిపిస్తున్న సైనా నెహ్వాల్‌పై అందరి దృష్టి ఉంది. సైనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే ఇక్కడ పతకం గెలవడానికి ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. సైనా తొలి రౌండ్‌లో హాంకాంగ్‌కు చెందిన చియుంగ్ న్గాన్ యితో తలపడనుంది.