Tokyo Olympics: కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి …ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ

|

Jun 09, 2021 | 2:14 AM

ఇండియన్ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ రాసినట్లుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా తెలిపంది. పుల్లెంల గోపిచంద్​తో సహా నలుగురు కోచ్​లను షట్లర్లతో పాటు పంపాలని...

Tokyo Olympics: కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి ...ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ
Coaches
Follow us on

ఇండియన్​ ఒలింపిక్ అసోసియేషన్​కు బ్యాడ్మింటన్​ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ఒలింపిక్స్​కు అర్హత సాధించిన షట్లర్లతో పాటు టోక్యో వెళ్లడానికి నలుగురు కోచ్​లను అనుమతించాలని అభ్యర్థించింది. ఇద్దరు ఫిజియోలను వారితో పాటు ప్రయాణించడానికి అంగీకరించాలని పేర్కొంది.

ఇండియన్ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ రాసినట్లుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా తెలిపంది. పుల్లెంల గోపిచంద్​తో సహా నలుగురు కోచ్​లను షట్లర్లతో పాటు పంపాలని కోరారినట్లుగా వెల్లడించింది. అలాగే ఇద్దరు ఫిజియోలను వారితో పాటు వెళ్లడానికి అంగీకరించాల్సిందిగా కోరింది. ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మన దేశానికి సానుకూల విజయాలు  వస్తాయని అభిప్రాయపడ్డింది.

టోక్యో ఒలింపిక్స్​ నిబంధనల ప్రకారం మొత్తం అథ్లెట్ల సంఖ్యలో మూడో వంతు మాత్రమే సహాయక సిబ్బంది ఉండాలి. కాగా, బ్యాడ్మింటన్​ నుంచి పీవీ సింధుతో పాటు సాయి ప్రణీత్​, డబుల్స్ జోడీ చిరగా శెట్టీ, సాత్విక్ రాజ్​ రాంకీ రెడ్డి అర్హత సాధించారు. అయితే బ్యాడ్మింటన్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా చేసిన అభ్యర్థనను ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇలాంటి సలహాలు, సూచనలు, అభ్యర్థనలు కాస్తా ముందుగా చెప్పి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.