మొహాలీ: ఆసీస్తో జరుగుతోన్న నాలుగో వన్డేలో మొదటి ఇన్నింగ్స్ చివరి బంతికి పేస్బౌలర్ బుమ్రా కొట్టిన సిక్సుకు కెప్టెన్ విరాట్కోహ్లీ ఫిదా అయ్యాడు. అతడితో పాటు ఆటగాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ కమిన్స్ బౌలింగ్లో యజువేంద్ర చాహల్ ఐదో బంతికి ఔటవ్వగా బుమ్రా బ్యాటింగ్కు దిగాడు. ఇక మిగిలిన ఆఖరి బంతికి బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్లో మొదటిసారి సిక్స్ బాదడంతో ఒక్కసారిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు మొదలయ్యాయి. అందరూ చప్పట్లు కొడుతూ ఎగురుతుండగా విరాట్కోహ్లీ సైతం చప్పట్లు కొడుతూ బుమ్రాను మెచ్చుకున్నాడు. మరోవైపు నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కుల్దీప్ యాదవ్ బుమ్రాను అభినందించాడు. దీంతో టీమిండియా స్కోరు 358/9కి చేరగా ఆసీస్ ముందు భారీ లక్ష్యం నిర్ధేశించింది. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేయగా అభిమానులు సంబరపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆసీస్పై గత ఐదు మ్యాచుల్లో (టీ20తో కలిపి) కేవలం ఏడు వికెట్లే తీయగా తన బౌలింగ్పై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్లో స్థానం లభించాలంటే బుమ్రా మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాణించాల్సిన అవసరం ఉంది.
That moment when @Jaspritbumrah93 hits the last ball for a maximum ??#INDvAUS pic.twitter.com/e6iOHorg8N
— BCCI (@BCCI) March 10, 2019