AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెలరేగిన హెట్‌మైర్, హోప్.. విండీస్ ఘనవిజయం

చెన్నై వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డేలో విండీస్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. 288 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. ప్రారంభంలోనే ఓపెనర్ అంబ్రిస్.. తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హెట్‌మైర్ చెలరేగిపోయాడు. కేవలం106 బంతుల్లో […]

చెలరేగిన హెట్‌మైర్, హోప్.. విండీస్ ఘనవిజయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 15, 2019 | 11:26 PM

Share

చెన్నై వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డేలో విండీస్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. 288 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. ప్రారంభంలోనే ఓపెనర్ అంబ్రిస్.. తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హెట్‌మైర్ చెలరేగిపోయాడు. కేవలం106 బంతుల్లో 11ఫోర్లు, 7 సిక్సులతో 139 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్‌గా వచ్చిన హోప్ కూడా సెంచరీతో కదంతొక్కాడు. 151 బంతుల్లో 7ఫోర్లు, ఓ సిక్స్‌తో 102 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు.హెట్‌మైర్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నికోలస్ పూరన్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇక టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌ ఆరంభంలోనే తడబడ్డారు. రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ 6 పరుగులకే ఓటయ్యాడు. కెప్టెన్ కోహ్లీ 4 పరుగులకే వెనుదిరిగాడు. అయితే అనంతరం వికెట్ పడకుండా.. శ్రేయాస్ అయ్యర్, పంత్‌లు స్కోర్ బోర్డును ముందుకు పరుగెత్తించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 88 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 70 పరుగులు చేయగా.. పంత్ 69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 71పరుగులు చేశాడు.

అయితే కీలక సమయంలో వీరిద్దరు ఔటయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్‌ జాదవ్‌ 35 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌తో 40 పరుగులు చేయగా.. జడేజా 21 పరుగులు చేశారు. అయితే చివర్లో జాదవ్‌, జడేజా, శివమ్‌దూబె వరుసగా విఫలమయ్యారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, కీమో పాల్‌, ఆల్జరీ జోసెఫ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.