AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవిశాస్త్రి “మా కొద్దు”.. క్రికెట్ అభిమానుల అసంతృప్తి..!

టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని మళ్లీ ఎంపిక చేయడం పై కొంతమంది క్రికిట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోర్నమెంట్లు గెలవడానికి ఇతర జట్లకు ఇది మంచి అవకాశమని, రాబోయే టోర్నమెంట్లలో భారత్ సెమీఫైనల్ మాత్రమే చేరుకుంటుందని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కోహ్లీకి సన్నిహితుడైన రవిశాస్త్రి ఎంపిక కావడంతో రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోను ట్రోల్ చేస్తున్నారు. కాగా, రవిశాస్త్రి తరువాత గత ఏడాది జూలైలో టీమిండియా […]

రవిశాస్త్రి మా కొద్దు.. క్రికెట్ అభిమానుల అసంతృప్తి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 7:45 AM

Share

టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని మళ్లీ ఎంపిక చేయడం పై కొంతమంది క్రికిట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోర్నమెంట్లు గెలవడానికి ఇతర జట్లకు ఇది మంచి అవకాశమని, రాబోయే టోర్నమెంట్లలో భారత్ సెమీఫైనల్ మాత్రమే చేరుకుంటుందని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కోహ్లీకి సన్నిహితుడైన రవిశాస్త్రి ఎంపిక కావడంతో రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోను ట్రోల్ చేస్తున్నారు. కాగా, రవిశాస్త్రి తరువాత గత ఏడాది జూలైలో టీమిండియా కోచ్‌గా కుంబ్లే బాధ్యతలు చేపట్టాడు. కుంబ్లే కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత భారత జట్టు తొలిసారిగా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సిరీస్‌నూ టీమిండియా కైవసం చేసుకుంటూ వచ్చింది. సాధారణంగా అయితే కుంబ్లే విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడంతో ఆయన కాంట్రాక్ట్‌ను 2019 ప్రపంచకప్‌ వరకు పొడిగిస్తారని అంతా భావించారు. కానీ బీసీసీఐ కొత్త కోచ్‌ నియామకం కోసం దరఖాస్తులు పెట్టి.. మళ్లీ రవిశాస్త్రిని ఎంపిక చేయడంతో కొంతమంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.