
భారత క్రికెట్లో కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు వేడెక్కాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్న ఊహాగానాల మధ్య, కొత్త కెప్టెన్ ఎవరవుతారనే అంశంపై క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆయన ప్రకారం, టీమ్ ఇండియా కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు.
ఇప్పటివరకు, శుభ్మాన్ గిల్ టీమ్ ఇండియా వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నా, రాబిన్ ఊతప్ప మాత్రం శ్రేయస్ అయ్యర్ను రోహిత్ తర్వాతి వారసుడిగా చూస్తున్నాడు. ఒకప్పుడు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత శ్రేయస్ అయ్యర్ను టీమ్ ఇండియా కెప్టెన్గా చూడాలన్న అభిప్రాయం బలంగా ఉండేది. అయితే, రంజీ ట్రోఫీకి గైర్హాజరైన కారణంగా అతను BCCI కేంద్ర కాంట్రాక్టును కోల్పోయాడు. అయినప్పటికీ, అతని ఆటతీరులో వచ్చిన మెరుగుదల, ఇటీవల దేశవాళీ క్రికెట్, వన్డే సిరీస్లలో అతను చూపించిన అద్భుత ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే, అతను భారత జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాగ్పూర్ వన్డేలో 36 బంతుల్లో 59 పరుగులు చేయడంతో పాటు, మిగిలిన రెండు మ్యాచ్ల్లో 44, 78 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతను శుభ్మాన్ గిల్ తర్వాత రెండవ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు.
ఊతప్ప వ్యాఖ్యల ప్రకారం, “శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ అవుతాడు” అని స్పష్టం చేశాడు. శుభ్మాన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఐపీఎల్ 2024లో తొలిసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆ జట్టు ప్లేఆఫ్కు చేరలేకపోవడం గిల్ కెప్టెన్సీపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో గిల్ భారత జట్టుకు నాయకత్వం వహించి 4-1 తేడాతో విజయాన్ని అందించాడు.
అయితే, శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున రెండవ అత్యధిక స్కోరర్గా నిలిచిన అతను, ఐదు మ్యాచ్లలో 325 పరుగులు సాధించాడు. పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ జట్లపై సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలోనూ ముంబైను టైటిల్కు నడిపించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కూడా ఊతప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “నాకు తెలిసి, ఇది కోహ్లీ, రోహిత్ శర్మల చివరి టోర్నమెంట్ కావొచ్చు. కానీ వారు కలిసి ఆడే చివరి టోర్నమెంట్ ఇదే అవుతుందని అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ తన ఫామ్ను త్వరగా అందుకోవాలని, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే అతని అద్భుతమైన ప్రదర్శన మొదలవుతుందని నేను భావిస్తున్నాను” అని ఊతప్ప పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో, టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నా, రాబిన్ ఊతప్ప అభిప్రాయంతో పాటు శ్రేయస్ అయ్యర్ ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే, అతనికి భారత జట్టు నాయకత్వం చేపట్టే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Robin Uthappa said "I think Shreyas Iyer is going to be the next Indian Captain". [Star Sports] pic.twitter.com/wKepoJLPXb
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..