AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: పొమ్మనలేక పొగబెడుతున్నారు.. రోహిత్, కోహ్లీ టీ20 కెరీర్ ఇక ముగిసినట్టే.?

విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టులో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కకపోవడం గమనార్హం..

Team India: పొమ్మనలేక పొగబెడుతున్నారు.. రోహిత్, కోహ్లీ టీ20 కెరీర్ ఇక ముగిసినట్టే.?
rohit kohli
Ravi Kiran
|

Updated on: Jul 06, 2023 | 7:20 PM

Share

విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టులో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లను వరుసగా 4వ టీ20 సిరీస్‌కు పక్కనపెట్టింది బీసీసీఐ. ప్రస్తుతం వీరు విండీస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఇరువురూ రెండు టెస్టులు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడతారు. అయితే విరాట్, రోహిత్‌ను టీ20లకు ఎంపిక చేయకపోవడం వెనుక ఓ కారణం ఉందట. టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు మేనేజ్‌మెంట్.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్దం చేసేందుకే రోహిత్-విరాట్‌‌లపై వేటు వేశారట.

ఇదిలా ఉండగా.. ఈ స్టార్ ఆటగాళ్లు టీ20లకు ఎంపిక కాకపోవడం ఇదేం తొలిసారి కాదు. టీ20 ప్రపంచకప్ 2022 నుంచి, ఇది వరుసగా నాలుగో సిరీస్‌కి వారు దూరమయ్యారు. గతేడాది న్యూజిలాండ్ టూర్‌లో కూడా రోహిత్-విరాట్‌లను టీ20 జట్టు నుంచి తప్పించారు. దీని తర్వాత, ఈ ఏడాది శ్రీలంక ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో ఈ ఇద్దరిని ఎంపిక చేయలేదు. కాగా, రోహిత్, కోహ్లీ నవంబర్ 10, 2022న అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో చివరిసారిగా టీ20 ఆడారు.