MS Dhoni: ధోనీ కావాలనే 2019 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించాడా.. అంపైర్ అనిల్ చౌదరి ఏమన్నాడంటే?

Anil Chaudhary on Dhoni 2019 Semifinal: 2019 వన్డే ప్రపంచకప్ గెలిచే ఫేవరెట్ జట్టుగా గుర్తింపు పొందిన టీమ్ ఇండియా.. సెమీఫైనల్లో తడబడింది. ఫైనల్ చేరేందుకు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని స్లో బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. ఇలా బ్యాటింగ్ చేయడం వల్లే భారత జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని వాదించేవారూ ఉన్నారు.

MS Dhoni: ధోనీ కావాలనే 2019 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించాడా.. అంపైర్ అనిల్ చౌదరి ఏమన్నాడంటే?
Ms Dhoni 2019 World Cup

Updated on: Jan 29, 2025 | 4:14 PM

Dhoni 2019 World Cup Controversy: 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) అర్ధసెంచరీలు చేశారు. ఈ హాఫ్ సెంచరీల సాయంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 1 పరుగుతో ఔట్ కాగా, మూడో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి 1 పరుగు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. దినేష్ కార్తీక్ (6), రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా 32 పరుగులు చేసి ఔటయ్యారు.

ఈ దశలో 7వ ర్యాంక్‌లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తుండగా, ధోనీ 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. కాగా, రవీంద్ర జడేజా 59 బంతుల్లో 77 పరుగులు చేశాడు.

ఇది కూడా చదవండి: Video: ఎవర్రా సామీ నువ్వు.. 10 సిక్స్‌లు, 6 ఫోర్లు.. 39 బంతుల్లోనే భారీ విధ్వంసం..

ఇవి కూడా చదవండి

కీలక దశలో ధోని నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చివరి ఓవర్ల సమయంలో ధోనీ డిఫెన్స్ ఆటకు ప్రాధాన్యత ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే, ఈ మ్యాచ్‌లో ధోనీ చివరి క్షణంలో రనౌట్ అయ్యి వికెట్ కోల్పోయాడు.

ఫలితంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ స్లో ఇన్నింగ్స్ ఈ ఓటమికి ప్రధాన కారణమని వాదించేవారూ ఉన్నారు. అలాగే, 2019 సెమీఫైనల్‌లో ధోనీ ఉద్దేశ్యపూర్వకంగానే భారత్‌ను ఓడించాడని ఆరోపిస్తున్న వారు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.

ఈ ఆరోపణలపై భారత సీనియర్ అంపైర్లలో ఒకరైన అనిల్ చౌదరిని ప్రశ్నించారు. అనిల్ చౌదరికి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు ధోని నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం వల్ల భారత జట్టు ఓడిపోయిందా? ధోనీ కావాలనే నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడాడా? అని ప్రశ్నలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: వామ్మో.. రోహిత్ శర్మ ఆ జంతువు మాంసం తిన్నాడా?

దీనికి అనిల్ చౌదరి బదులిస్తూ.. మహేంద్ర సింగ్ ధోనీ 50 పరుగులు చేయడంతో టీమ్ ఇండియా చివరి దశకు చేరుకుంది. అతను హాఫ్ సెంచరీ చేయకుంటే భారత జట్టు 50 పరుగుల తేడాతో ఓడిపోయేది.

ఇలాంటి డిబేట్‌లు సృష్టించే వారికి క్రికెట్ పట్ల పూర్తి అవగాహన లేదు. పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడిన వారు ఇలాంటి వాదనలు చేయరు. ఇక ఆడని వాళ్ళు కూడా ఇలాంటి చెత్త వాదనలకు దిగుతుంటారు. మహేంద్ర సింగ్ ధోనీ ఉద్దేశపూర్వకంగానే భారత జట్టును ఓడించలేదని అనిల్ చౌదరి క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us