AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: తనదైన ముద్ర కోసం ఆ ఇద్దరిపై వేటు.. చెత్త నిర్ణయాలతో టీమిండియా పరువు తీస్తోన్న గంభీర్..?

India vs New Zealand ODI Series: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న వన్డే సిరీస్‌ కోసం టీమ్ ఇండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫామ్‌లో ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టడం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు? వారిని ఎందుకు తొలగించారు? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

IND vs NZ: తనదైన ముద్ర కోసం ఆ ఇద్దరిపై వేటు.. చెత్త నిర్ణయాలతో టీమిండియా పరువు తీస్తోన్న గంభీర్..?
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Jan 06, 2026 | 12:10 PM

Share

Gautam Gambhir: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పేర్లు లేకపోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. వారు మరెవరో కాదు.. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ.

రుతురాజ్ గైక్వాడ్‌పై వేటుకు కారణమేంటి?

రుతురాజ్ గైక్వాడ్ గత కొంతకాలంగా దేశీవాళీ క్రికెట్‌లోనూ, గతంలో ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీతో రాణించిన గైక్వాడ్‌ను పక్కన పెట్టడం వెనుక గంభీర్ “కోచ్ పవర్” ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గంభీర్ రాకతో జట్టులో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఓపెనింగ్ స్థానంలో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ నిర్ణయించడమే గైక్వాడ్‌కు మొండిచేయి ఎదురవ్వడానికి ప్రధాన కారణం అని సమాచారం.

ఇది కూడా చదవండి: డబ్బుల్లేక అలా చేశాడు గానీ..! లేదంటే పెద్ద క్రికెటర్ అయ్యేవాడు.. ఆ టాలీవుడ్ హీరో ఎవరంటే..?

ఇవి కూడా చదవండి

మహమ్మద్ షమీ గైర్హాజరీ వెనుక..

మరోవైపు, గాయం నుంచి కోలుకుని విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణించిన మహమ్మద్ షమీని కూడా జట్టులోకి తీసుకోలేదు. గంభీర్ యువ రక్తానికి ప్రాధాన్యత ఇస్తూ హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లను ప్రోత్సహించాలని చూస్తున్నారు. షమీ ఫిట్‌నెస్‌పై నమ్మకం లేకపోవడం లేదా భవిష్యత్తు దృష్ట్యా యువకులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే షమీని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

గంభీర్ నిర్ణయాలపై విమర్శలు..

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లు ఫామ్‌లో లేకపోయినా జట్టులో కొనసాగించడం, అదే సమయంలో నిలకడగా రాణిస్తున్న గైక్వాడ్ వంటి వారిని పక్కన పెట్టడంపై బీసీసీఐ పెద్దలు కూడా కొంత అసహనంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్ తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయాలు న్యూజిలాండ్ సిరీస్‌లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: IND vs NZ: తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్.. ప్లేయింగ్ 11లో షాకింగ్ మార్పు?

ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు జట్టులో లేకపోవడం వల్ల భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ గంభీర్ కోచింగ్ కెరీర్‌కు మరో అగ్నిపరీక్షగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..