
India vs New Zealand, 3rd T20I: మూడో టీ20లో న్యూజిలాండ్ భారత్ ముందు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లెన్ ఫిలిప్స్ 48, మార్క్ చాప్మన్ 32 పరుగులు చేశారు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు.
హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. ఒక బ్యాట్స్మన్ రనౌట్ అయ్యాడు. కివీస్ తరపున మాట్ హెన్రీ ఒక వికెట్, కైల్ జామిసన్ మూడు, రాచిన్ రవీంద్ర నాలుగు, డెవాన్ కాన్వే రెండు, టిమ్ సీఫెర్ట్ 12, మిచెల్ సాంట్నర్ 27, డారిల్ మిచెల్ 14 పరుగులు చేశారు.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..