AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో ఇంగ్లీషోళ్లకు బడితపూజ.. రిటైర్మెంట్ ఏజ్‌లో ఈ రచ్చ ఏంది సామీ

Ravindra Jadeja: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 224 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ, జడేజా-సుందర్ తలో 53 పరుగులతో రాణించడంతో టీమిండియా 396 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇప్పుడు 374 పరుగులు అవసరం.

IND vs ENG: ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో ఇంగ్లీషోళ్లకు బడితపూజ.. రిటైర్మెంట్ ఏజ్‌లో ఈ రచ్చ ఏంది సామీ
Ravindra Jadeja
Venkata Chari
|

Updated on: Aug 03, 2025 | 11:26 AM

Share

India vs England 5th Test: ఓవల్‌లో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్ ఉత్కంఠ దశకు చేరుకుంది. టీం ఇండియా నుంచి ఒకే ఒక్క సెంచరీ వచ్చినప్పటికీ, సర్ జడేజా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను మరో హాఫ్ సెంచరీ సాధించి 500 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ సిరీస్‌లో, టీం ఇండియా నుంచి 500 పరుగుల మైలురాయిని దాటిన మూడవ ఆటగాడు జడేజా. దీంతో, జడ్డూ సునీల్ గవాస్కర్ రికార్డును లాక్కున్నాడు.

జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్..

టీం ఇండియా తరపున యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. మరోవైపు, భారత్ తడబడుతున్నట్లు అనిపించింది. నైట్ వాచ్‌మన్ ఆకాష్ దీప్ కూడా 66 పరుగులు చేశాడు. దీని తర్వాత, రవీంద్ర జడేజా బాధ్యత వహించి 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడి సిరీస్‌ను 516 పరుగుల వద్ద ముగించాడు. అతనితో పాటు, యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ భారతదేశం తరపున 500+ పరుగులు సాధించారు.

భారీ రికార్డ్ సృష్టించిన జడేజా..

ఈ సిరీస్‌లో రవీంద్ర జడేజా బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతను 6 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ సిరీస్‌లో అత్యధికంగా 50+ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. 1966లో ఇంగ్లాండ్‌లో 5 సార్లు ఈ ఫీట్ చేసిన గ్యారీ సోబర్స్ రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ఇది మాత్రమే కాదు, ఇంగ్లాండ్‌లో ఒక సిరీస్‌లో అత్యధికంగా 50+ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రవీంద్ర జడేజా నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రిషబ్ పంత్ చెరో 5 సార్లు ఈ ఫీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

టీమిండియా ముందు 374 పరుగుల లక్ష్యం..

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 224 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ, జడేజా-సుందర్ తలో 53 పరుగులతో రాణించడంతో టీమిండియా 396 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇప్పుడు 374 పరుగులు అవసరం. ఇంగ్లీష్ జట్టు తరఫున అట్కిన్సన్ 8 వికెట్లు పడగొట్టగా, జోష్ టంగ్ 6 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..