Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. సిక్స్‌లు, ఫోర్లతో రోహిత్ ఊచకోత.. వీడియో చూస్తే ఇంగ్లండ్‌కు దడ పుట్టాల్సిందే

Rohit Sharma Video: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ తర్వాత, టీం ఇండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. రోహిత్ శర్మ ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించాడు. రోహిత్ శర్మ మరోసారి తన పాత ఫాంను సంతరించుకున్నట్లు ఈ వీడియో చూస్తే ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే.

Video: వామ్మో.. సిక్స్‌లు, ఫోర్లతో రోహిత్ ఊచకోత.. వీడియో చూస్తే ఇంగ్లండ్‌కు దడ పుట్టాల్సిందే
Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jan 17, 2025 | 2:17 PM

Rohit Sharma Video: రోహిత్ శర్మ చాలా కాలంగా బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు. కానీ, ఇప్పుడు ఆ బ్యాడ్ ఫాం ముగిసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, రోహిత్ శర్మ హిట్‌మ్యాన్ అవతార్ మరోసారి కనిపించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న వీడియోను రోహిత్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డే-నైట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన షాట్లు ఆడాడు. కేవలం సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. గత రెండు సిరీస్‌లలో రోహిత్ తన బ్యాట్ నుంచి అమలు చేయలేని ప్రతీ షాట్‌ను ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.

రోహిత్ శర్మ సూపర్బ్ బ్యాటింగ్..

ముంబైలోని వాంఖడే మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ కఠినమైన షాట్లు ఆడాడు. డ్రైవ్‌ల నుంచి కట్స్‌ అండ్‌ పుల్‌ల వరకు అన్నీ రోహిత్‌ బ్యాట్‌ నుంచే వచ్చాయి. రోహిత్ టైమింగ్ అద్భుతంగా అనిపించింది. అతని ప్రతి షాట్ సక్సెస్ అయింది. రోహిత్ శర్మ ఈ వీడియో చూస్తుంటే, అతని పాత రిథమ్ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అతను మైదానంలోకి తన పాత ఫాంతో తిరిగి వస్తాడని అంతా భావిస్తున్నారు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్..

ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ కనిపించనున్నాడు. ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న, మూడో వన్డే ఫిబ్రవరి 12న జరగనుంది. ఈ వన్డే సిరీస్ తర్వాత, ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయ్‌కి వెళ్లనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది.

రోహిత్ రంజీ ట్రోఫీ ఆడతాడా?

అలాగే, రోహిత్ శర్మ కూడా రంజీ ట్రోఫీ ఆడగలడని వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబై రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేశాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాలని టీమిండియా ఆటగాళ్లందరినీ బీసీసీఐ కోరింది. అలా చేయకుంటే వారిపై చర్యలు తీసుకోవచ్చు. మరి రోహిత్ ఎప్పుడు రంగంలోకి దిగుతాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..