AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో ఆ ఏడుగురు ఆటగాళ్ల క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

ఆసియా కప్ 2025 కోసం పాల్గొనే 8 దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో బాబర్ అజామ్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ రిజ్వాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఆడటం లేదు. అన్ని దేశాలు తమ అత్యంత బలమైన జట్లను సెలక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాయి.

Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో ఆ ఏడుగురు ఆటగాళ్ల క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?
Asia Cup 2025 (1)
Rakesh
|

Updated on: Sep 07, 2025 | 8:04 PM

Share

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 కోసం మొత్తం 8 దేశాలు తమ జట్ల వివరాలను ప్రకటించాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో బాబర్ అజామ్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ రిజ్వాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఆడటం లేదు. అన్ని దేశాలు తమ స్ట్రాంగ్ టీంను రెడీ చేయడానికి ప్రయత్నించాయి. కానీ కొందరు ఆటగాళ్లకు ఈ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించకపోవచ్చు. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ఈ ఏడుగురు ఆటగాళ్లకు చోటు కష్టమే

ఆసియా కప్ కోసం భారత జట్టులో ఎంపికైన రింకూ సింగ్, హర్షిత్ రాణాకు ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కకపోవచ్చు. భారత జట్టులో ఇప్పటికే మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్లు చాలామంది ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఉండటంతో రింకూ సింగ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దొరకడం కష్టమే. మరోవైపు, భారత పేస్ బౌలింగ్ బాధ్యతలను జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చూసుకుంటారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే రూపంలో మరో ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లు కూడా జట్టుకు అందుబాటులో ఉంటాయి. యూఏఈ పిచ్‌లపై ఐదుగురు పేస్ బౌలింగ్ ఆప్షన్ల అవసరం లేదు, కాబట్టి హర్షిత్ రాణా అన్ని మ్యాచ్‌లకు బయటే ఉండాల్సి రావచ్చు.

బంగ్లాదేశ్ జట్టులో ఇప్పటికే చాలామంది పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం వల్ల మహమ్మద్ సైఫుద్దీన్ కూడా బయట కూర్చోవాల్సి రావచ్చు. అదేవిధంగా పాకిస్థాన్కు హారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ రూపంలో ముగ్గురు ప్రధాన పేస్ బౌలర్లు ఉన్నారు. వీరితో పాటు సల్మాన్ మీర్జాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దొరకడం కష్టమే. ఒకవేళ ఎవరైనా గాయం లేదా ఫిట్‌నెస్ సమస్యతో బయటకు వెళ్తేనే మీర్జాకు అవకాశం లభిస్తుంది.

పాకిస్థాన్కు చెందిన ఖుష్దిల్ షా టీ20 గణాంకాలు అంతగా బాగాలేవు. ఈ ఏడాది 10 టీ20 మ్యాచ్‌లలో అతను కేవలం 86 పరుగులు చేసి 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌లో కూడా ఇప్పుడు పదును కనిపించడం లేదు. 2024 నుంచి అతను ఆఫ్ఘనిస్తాన్ తరపున 9 టీ20 మ్యాచ్‌లలో కేవలం 9 వికెట్లు మాత్రమే తీశాడు.

శ్రీలంకకు చెందిన కమిల్ మిశారా ఈ నెలలోనే టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అతను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. శ్రీలంకకు ఇప్పటికే పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ వంటి ప్రమాదకర ఓపెనింగ్ జోడీ ఉంది. అందుకే మిశారాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాకపోవచ్చు.

ఆసియా కప్‌లో ఆ ఏడుగురు ప్లేయర్లు

రింకూ సింగ్ (భారత్), హర్షిత్ రాణా (భారత్), మహమ్మద్ సైఫుద్దీన్ (బంగ్లాదేశ్), సల్మాన్ మీర్జా (పాకిస్థాన్), ఖుష్దిల్ షా (పాకిస్థాన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్తాన్), కమిల్ మిశారా (శ్రీలంక)

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..