AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : ఆ ఇద్దరూ ప్యాడ్స్ వేసుకునే లోపే ప్రాక్టీస్ అయిపోయింది.. టీమిండియాకు కొత్త టెన్షన్… మరి జట్టులో ఉంటారా ?

ఆసియా కప్ ప్రారంభానికి ముందు, భారత క్రికెట్ జట్టు సోమవారం సాయంత్రం ఐసీసీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేసింది. ఈ సమయంలో సంజు సామ్సన్ అందరికంటే ముందుగా ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్తో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చాడు. మిగిలిన ఆటగాళ్ళు అప్పటికి నెమ్మదిగా వస్తున్నారు.

Asia Cup 2025 : ఆ ఇద్దరూ ప్యాడ్స్ వేసుకునే లోపే ప్రాక్టీస్ అయిపోయింది.. టీమిండియాకు కొత్త టెన్షన్... మరి జట్టులో ఉంటారా ?
Team India (1)
Rakesh
|

Updated on: Sep 09, 2025 | 6:48 AM

Share

Asia Cup 2025 : ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లు సోమవారం సాయంత్రం ఐసీసీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్‌లో కొంత ఆసక్తికరమైన వాతావరణం కనిపించింది. సంధీప్ శర్మ అందరికంటే ముందుగా ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ తో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో మిగతా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మైదానానికి చేరుకున్నారు.

సంజు శాంసన్‌కు తీవ్ర నిరాశ!

సంధీప్ శర్మ పూర్తి ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేశాడు. అతను కుడి వైపునకు డ్రైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నప్పుడు ఫీల్డింగ్ కోచ్ అతడిని పొగిడాడు. ఆ తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అతడి వద్దకు వచ్చి మూడు నిమిషాల పాటు మాట్లాడాడు. అదంతా వికెట్ కీపింగ్ గురించి కాకుండా బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నట్లు అనిపించింది.

అయితే, ఓ వైపు జితేష్ శర్మ, శివమ్ దూబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సంజు శాంసన్ బ్యాటింగ్ కిట్ వేసుకుని నెట్స్ దగ్గరకు వచ్చాడు. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ దగ్గర చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత కూడా శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ప్రాక్టీస్ చేశారు. అయినా కూడా సంజును ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయడానికి పిలవలేదు.

రింకు సింగ్ పరిస్థితి కూడా అంతే!

అంతిమంగా, అందరి ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత సంజు శాంసన్‌కు బ్యాటింగ్ చేయడానికి అవకాశం లభించింది. అతను ఐస్ బాక్స్ మీద కూర్చుని చాలాసేపు ఎదురు చూశాడు. చివరికి నెట్ బౌలర్ అతనికి బౌలింగ్ చేశాడు. అలాగే రింకు సింగ్ కూడా ప్యాడ్స్ వేసుకోకుండానే కనిపించాడు. దీంతో అతడు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోవచ్చని సంకేతాలు లభించాయి. ప్రాక్టీస్ సెషన్ ముగిసే సమయానికి రింకు ప్యాడ్స్ వేసుకుని, సహాయక సిబ్బంది వేసిన త్రోడౌన్స్‌ను ప్రాక్టీస్ చేశాడు.

గంభీర్ దృష్టి బ్యాటింగ్ డెప్త్, బ్యాటింగ్ ఆల్​రౌండర్లపై ఉంది. కాబట్టి, ఫినిషర్‌గా జితేష్ శర్మకు ఎక్కువ అవకాశం లభించవచ్చని ఈ ప్రాక్టీస్ చూస్తుంటే అర్థమవుతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..