IPL 2021: పోరాడి ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌… ఉత్కంఠ పోరులో పంజాబ్‌ గెలుపు.. చివరి బంతికి విజయం

|

Apr 13, 2021 | 12:12 AM

IPL 2021: ఐపీఎల్‌ 14లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో కనబర్చిన పంజాబ్‌ 4 పరుగుల...

IPL 2021: పోరాడి ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌... ఉత్కంఠ పోరులో పంజాబ్‌ గెలుపు.. చివరి బంతికి విజయం
Ipl 2021
Follow us on

IPL 2021: ఐపీఎల్‌ 14లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో కనబర్చిన పంజాబ్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 7 వికెట్లకు 217 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌(119: 63 బంతుల్లో 12 ఫోర్లు, 7సిక్సర్లు) భారీ శతకం వృథా అయింది. జట్టును గెలిపించేందుకు ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు.

అయతే నరాలు తెగే ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ కొనసాగింది. చివరి బంతి వరకు విజేత ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇలానే సాగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 200కు పైగా పరుగులతో భారీ స్కోర్‌ నెలకొల్పినా రాజస్థాన్‌ చివరి బతి వరకు పోరాడింది. ప్రధానంగా ఆ జట్టు కెప్టెన్‌ సంజు శాంసన్‌ (119: 63 బంతుల్లో.. 12 ఫోర్లు, 7 సిక్సులు) ఒంటరి పోరాటం చేసిన తీరు అభిమానులను కట్టిపడేసింది. శాంసన్ సెంచరీతో అదరగొట్టినా మిగతా బ్యాట్స్‌మన్ రాణించకపోవడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

Also Read: RR vs PBKS IPL 2021Highlights: పోరాడి ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌.. సంజు సామ్సన్‌ సెంచరీ వృథా.. పంజాబ్‌ గ్రాండ్‌ విక్టరీ.. ‌