నా జట్టుకు పట్టిన దరిద్రాలు వీళ్లే.. ఈ నలుగురిని పీకేస్తే అంతా సెట్.. లక్నో ఓనర్ కీలక నిర్ణయం?

LSG Team Changes: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినా, మైదానంలో విఫలమవుతున్న స్టార్ ఆటగాళ్లపై ఆయన కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నాటికి జట్టులో సమూల మార్పులు చేస్తూ, నలుగురు కీలక ఆటగాళ్లను వదిలించుకోవాలని యాజమాన్యం భావిస్తు్న్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నా జట్టుకు పట్టిన దరిద్రాలు వీళ్లే.. ఈ నలుగురిని పీకేస్తే అంతా సెట్.. లక్నో ఓనర్ కీలక నిర్ణయం?
Lsg Ipl 2026 Sanjiv Goenka
Image Credit source: https://x.com/JPdza28791

Updated on: Apr 27, 2026 | 4:22 PM

LSG May Release 4 Players after IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. జట్టు పాయింట్ల పట్టికలో అడుగున ఉండటంతో యజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ముఖ్యంగా కోట్లాది రూపాయలు కుమ్మరించి జట్టులోకి తెచ్చుకున్న సీనియర్ ఆటగాళ్లు బాధ్యతారాహిత్యంగా ఆడటం జట్టును దెబ్బతీస్తోంది. మైదానంలోనే ఆటగాళ్లతో గోయెంకా చర్చలు జరుపుతున్న దృశ్యాలు జట్టులో ఉన్న అంతర్గత విభేదాలను స్పష్టం చేస్తున్నాయి.

అట్టడుగున లక్నో.. ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు..

ప్రస్తుత సీజన్‌లో లక్నో ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి, 4 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది. వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. కనీసం 160 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడం బ్యాటింగ్ వైఫల్యానికి నిదర్శనం. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉండే అవకాశం ఉండటంతో, యాజమాన్యం ఇప్పుడు ప్రదర్శన లేని ఆటగాళ్లను సాగనంపేందుకు సిద్ధమైంది.

లక్నో జట్టు నుంచి వేటు పడనున్న ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..

1. రిషబ్ పంత్: గత వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరతో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్, అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కేవలం 189 పరుగులు మాత్రమే చేయడం అతని సామర్థ్యానికి తక్కువ. రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి తర్వాత గోయెంకాతో పంత్ జరిపిన వాగ్వాదం అతని నిష్క్రమణను ఖాయం చేస్తోంది.

2. నికోలస్ పూరన్: రూ. 21 కోట్లకు జట్టు అట్టిపెట్టుకున్న ఈ విండీస్ వీరుడు ఈసారి పూర్తిగా తేలిపోయాడు. మధ్య ఓవర్లలో వేగంగా ఆడాల్సిన పూరన్, ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 82 పరుగులు మాత్రమే చేసి జట్టును కష్టాల్లో నెట్టాడు.

3. మహమ్మద్ షమీ: రూ. 10 కోట్లతో జట్టులోకి వచ్చిన అనుభవజ్ఞుడైన పేసర్ షమీ, ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేటు కూడా ఎక్కువగా ఉండటం జట్టు బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచింది.

4. మార్కస్ స్టోయినిస్: ఆల్‌రౌండర్‌గా జట్టుకు సమతుల్యత అందించాల్సిన స్టోయినిస్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం, పరుగులు చేయడంలో విఫలమవ్వడం వల్ల ఇతనిపై కూడా వేటు పడే అవకాశం ఉంది.

ఈ పరిణామాలు చూస్తుంటే వచ్చే ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ సరికొత్త రూపంలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us