భారత్ VS శ్రీలంక: రోహిత్ సెంచరీ..వరల్డ్‌కప్‌ హిస్టరీలో నయా రికార్డు

| Edited By:

Jul 06, 2019 | 10:37 PM

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 36.5ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో రోహిత్ వరల్డ్ కప్‌లలో ఓ కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఓ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఉన్న సంగక్కర రికార్డును […]

భారత్ VS శ్రీలంక: రోహిత్ సెంచరీ..వరల్డ్‌కప్‌ హిస్టరీలో నయా రికార్డు
Follow us on

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 36.5ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో రోహిత్ వరల్డ్ కప్‌లలో ఓ కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఓ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఉన్న సంగక్కర రికార్డును భారత వైస్ కెప్టెన్ బద్దలుగొట్టాడు. సెంచరీ చేసిన వెంటనే రోహిత్ రజిత బౌలింగ్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.