వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న.. ఇక టైటిల్ వాళ్లదే: పంత్ షాకింగ్ కామెంట్స్.!

Rishabh Pant Comments on Priyan Arya: పంజాబ్ కింగ్స్ దెబ్బకు లక్నో మైండ్ బ్లాక్ అయింది. కొండంత స్కోర్‌ను ఛేజ్ చేయలేక ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గాయాలు నాకోసం ఎదురుచూస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు.

వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న.. ఇక టైటిల్ వాళ్లదే: పంత్ షాకింగ్ కామెంట్స్.!
Rishabh Pant Comments After Lsg Match

Updated on: Apr 20, 2026 | 6:26 PM

Rishabh Pant Comments on Priyan Arya: ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో శ్రేయస్ అయ్యర్ సేన విశ్వరూపం ప్రదర్శించింది. భారీ లక్ష్య ఛేదనలో విఫలమైన లక్నో, 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమి అనంతరం లక్నో సారథి రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పంజాబ్ బ్యాటర్ల పరుగుల విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ ప్రియాన్ ఆర్య కేవలం 37 బంతుల్లోనే 93 పరుగులు చేసి లక్నో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. మరోవైపు కన్నోలి 87 పరుగులతో రాణించడంతో పంజాబ్ కొండంత లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచింది. ప్రియాన్ ఆర్య బ్యాటింగ్ దాటికి లక్నో బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.

లక్నో పోరాటం వృథా..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభం నుంచే తడబడింది. మార్క్రామ్ (42), మార్కస్ స్టోయినిస్ (40), రిషబ్ పంత్ (43) పరుగులతో కొంత మేర పోరాడినప్పటికీ, అవసరమైన రన్ రేట్ పెరిగిపోవడంతో బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. పంజాబ్ బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఓటమిపై రిషబ్ పంత్ భావోద్వేగ స్పందన..

మ్యాచ్ అనంతరం తన జట్టు ఓటమిపై రిషబ్ పంత్ నిష్కర్షగా మాట్లాడారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడు ప్రియాన్ ఆర్య ఆడిన తీరును ఆయన ప్రశంసించాడు. ఆర్య ఫామ్ ముందు ఏ బౌలర్ అయినా నిలవడం కష్టమని, అతన్ని త్వరగా అవుట్ చేయలేకపోవడం తమకు శాపంగా మారిందని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ స్కోరును 230 పరుగుల లోపు నియంత్రించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పంత్ పేర్కొన్నాడు.

గాయాలు, భవిష్యత్తు ప్రణాళిక..

ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ తన వ్యక్తిగత గాయాల గురించి కూడా ప్రస్తావించాడు. “ఇప్పటికే ఒక చేతికి గాయమై ఉండగా, ఈ మ్యాచ్‌లో మరో చేతికి దెబ్బ తగిలింది. నా కోసం ఏదో ఒక కొత్త గాయం ఎదురుచూస్తూనే ఉన్నట్లు అనిపిస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రతి బంతి కీలకమని, అందుకే భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు కోల్పోయామని వివరించాడు. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి, తదుపరి మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us